8, డిసెంబర్ 2008, సోమవారం

ముంబై మారణ హోమం - మూడు రాష్ట్రాల ప్రజా తీర్పు , ఓటరులో చైతన్యము వస్తుందా?

రేపు కాంగ్రెస్ సామంత రాజుల భవిష్యత్తు తేలబోతుంది.ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు రాజస్థాన్,మధ్యప్రదేష్,ఢిల్లీ,చత్తీస్ ఘడ్,మిజోరాం రాష్ట్రాల్లో పోటీ ముఖ్యంగా కాంగ్రెస్,భా.జ.పా. మధ్యనే ఉంది. ఎదో ఒకటి గెలవాలి కాబట్టి గెలుస్తుంది.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు , ఎలక్షన్ జరిగిన తేది లు యివి.

చత్తీస్ ఘడ్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 14 మరియు 2౦
మధ్యప్రదేష్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 25
ఢిల్లీ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 29
మిజోరాం : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 2
రాజస్థాన్ : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 4

ఇక్కడ నాకు చత్తీస్ ఘడ్,మధ్యప్రదేష్ లలో ఎవరు వస్తారో అని ఆసక్తి ఏమాత్రము లేదు.కాని మిగిలిన 3 రాష్ట్రాలు ఢిల్లీ,మిజోరాం,రాజస్థాన్ లలో నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది.కారణం ఈ 3 రాష్ట్రాల్లో ముంబై మారణహోమం తరువత ఓటింగ్ జరిగింది.

వీటన్నిటిలో కుడా ఢిల్లీ మీద ఆసక్తి ఎక్కువగా వుంది.కారణం ఇక్కడ నిరక్షరాస్యత తక్కువ.అలాగే ముంబై లో జరిగిన దారుణానికి కొద్దో గొప్పో అలోచించే వర్గము వారు ఎక్కువగా వుండే ప్రదేశాల్లో ఇది ఒకటి.ఉగ్రవాదనికి ప్రతిసారి బలి అయ్యే ప్రాంతాల్లో ఇది మొదటిది.అలాగే దేశ రాజకీయాలను మనందరికంటే దగ్గరిగా గమనించే మేధావి వర్గము వసించేదీ ఇక్కడే.

మిగిలిన 2 రాష్ట్రాలలో కూడా డిసెంబర్ లో ఎన్నికలు జరిగినా వాటిని విశ్లేషించ డానికి సరిపడా విషయ పరిఙ్ఞానము నా వద్ద లేదు. అంటే చదువుకున్న వారెంతమంది,పల్లెలెన్న్ని,ఉద్యోగులు మొదలైన చాలా విషయాలు ప్రభావము చూపుతాయి.

ఇక ఢిల్లీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే ఉగ్రవాదము,దేశభవిష్యత్తు మొదలైనవి టపాలు,ఆభిప్రాయలు,వ్యాసాలు,ఉపన్యాసాలు మొదలైన వాటికే పరిమితమా లేక ఓటరు లో నిజంగా ఈ మార్పు కనిపిస్తుందా లేదా అని.

నాకైతే ఇప్పటిదాక వేచిచూసే ధోరణి లో ఉన్న U.P.A నవంబర్ 29 తరువాత ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గల్లంతైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై యుద్ధభేరి మొగిస్తుందనిపిస్తుంది.ప్రతిదీ రాజకీయలతో ముడిపెట్టే మన రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చుడాలని వుంది.దానికి ఇంకా రెండు రోజుల టైం వుంది.

6, డిసెంబర్ 2008, శనివారం

జల్లెడ లో మీటపా మొదటి పేజిలో మొదటిటపాగా కనిపించాలంటే?

ఈ మధ్య జల్లెడ లో అప్పుడే పోస్ట్ చేసినా, నా బ్లాగ్ టపా ఎ ప్పుడూ మొదటి పేజీ లో కనిపించేది కాదు. కారణం ఏంటి చెప్మా అని ఆలోచిస్తూ మిగిలిన టపా ల టైం చూసిన తరువాత కాని బొధ పడలేదు.టపాలని జల్లెడ సంకేతిక వర్గము వారు ఏ మాత్రము టైం ను యూనివర్సల్ టైం కి మార్చటము లేదని. దీని ఫలితంగా టపాలు అన్ని కూడా ఆయా స్థానిక సమయము ప్రకారము ప్రచురితమౌతున్నయి.కాబట్టి అ.సం.రా (U.S.A ) టపాలు చాలా వరకు ఏ రెండవ పేజీ లొనో కనిపిస్తున్నాయి. ఇది గమనిచిన వారు వాళ్ళ టపా ని పబ్లిష్ చెసేటప్పుడు టైంస్టాంప్ మార్చి పబ్లిష్ చేయడము కూడా గమనించాను.

దీనికి రెండు రకాల పరిష్కారములు:

1) జల్లెడ సాకేతిక వర్గము వారు అన్ని ఫీడ్ లను యూనివర్సల్ స్టాండర్డ్ టైం (U.S.T) కి మార్చి ఆ టైం ప్రకారము వరుస క్రమమును నిర్ణయించి ప్రచురించడము. ఇది సర్వదా అభిలషనీయము.కారణము U.S.A లొ వున్నవాడు ఆస్ట్రేలియా టైం పెట్టుకొని తన టపా ఎప్పుడూ మదటి పేజీ లో మదటి టపా గా వుండేటట్టు చేసే దొంగ దారి ని అడ్డుకోవచ్చు.

2)జల్లెడ వారు ఈ తప్పుని సరి చేసే దాక మీరు ఈ క్రింది పద్ధతి పాటించండి.

మీరు మీ బ్లాగు లో Settings-->Formating పీజీ లోకి వెళ్ళండి. ఆ పెజీ లో వున్న టైంజోన్ ని G.M.T+ 5:౩౦ కి మర్చి save చేయండి. మీ టపా ఇండియా టైం ప్రకారము ప్రచురితమౌతుంది.

5, డిసెంబర్ 2008, శుక్రవారం

తోటి మనిషి ఆవేదన!

నాకొచ్చిన ఒక మైల్ కి తెలుగు అనువాదం. * ( నక్షత్ర ) గుర్తున్నవి నా స్వంతం. ఇది ముంబై ఉగ్రవాద దాడి తరువాత సగటు భారతీయుని మనో భావాలకు అద్దం పడుతుంది.

"ఉగ్రవాది ని క్షమించడమా లేదా అనేది దేవునికి వదిలేద్దం.కానీ వాళ్ళకి దేవుని కలిసేందుకు నిర్ణీత సమయాన్ని నియంత్రించడము మా వంతు." (ఇండియన్ ఆర్మి)

* "ఆహ్వానము : ఈ రోజు రాత్రికి ప్రత్యేక విందు.
స్థలము: తాజ్,ముంబై.
దుస్తులు: చిల్లులబుల్లెట్ ప్రూఫ్, సైకిల్ హెల్మెట్.
ప్రత్యేక ఆకర్షణ: ఉగ్రవాదుల, మహరాష్ట్ర పోలీసుల ఫైర్ వర్క్స్, ఇంకా హిరో దర్శకులు. "

" టెర్రరిస్టులు పడవల ద్వారానే కాదు, ఓట్ల ద్వారా కూడా వస్తారు."

"నాకు క్రొవ్వొత్తి వెలిగించి చనిపోయిన వాళ్ళ ఙ్ఞాపకాలను పూడ్చి పెట్టాలని లేదు.నా మనసు క్రోధం తో రగిలి పోతుంది.తాజ్ ముందు విజయ పతాక లేక జాతీయ జెండా ఆవిష్కరించాల్సిన కారణము ఒక్కటి కూడా లేదు."

"రాజ్ థాక్రే ఎక్కడ దాక్కున్నావు? నీ ముంబై ఇక్కడి కాని వాళ్ళతో ( స్థానికులు కాదు ) నిజంగా యుద్ధము చేస్తుంది."

* "ఉగ్రవాదులు ప్రజల కళ్ళు తెరిపించారు.వ్యవస్థ కళ్ళు కాదు. వ్యవస్థ రాజకీయ నీడలో నిద్రమత్తుతో ఇంకా జోగుతుంది."

* "మాకు నిద్రలేదు , కారణం ఎప్పుడు బాంబు పేలుతుందనో కాదు
నా స్థలం నాతమ్ముడు ఎక్కడ కబ్జా చెస్తాడో అని
నా ఇంటి ఆడపడుచు రాత్రి 9 అయినా ఇల్లు చేరలేదని
మా అబ్బాయి కాన్వెంట్ ఫీజు లక్ష అని
మా పాప బడి గోడలు ఎక్కడ కూలుతాయోఅని
ఆసుపత్రి లో ఆపరేషన్ తో అవయవాలు ఎక్కడ కొట్టేస్తరోనని

ఎంసెట్ పేపరు ఎక్కడ లికవుతుందో అని
రేపు మా పెద్దోడికి ఉద్యోగము వస్తుందో రాదో అని
మా పిల్ల పెళ్లి కి కట్నమెంతో అని.
నా పర్సు ఎవడు కొట్టేస్తాడో అని
నేను డబ్బు దాచిన బ్యాంకు ఎప్పుడు మునుగుతుందో అని.

దారిలో బస్సు ఎక్కడ తగలబెడ్తారో ఆని
ఈ సంవత్సర వినాయక చందా పట్టీ ఎంత వస్తుందో అని
రేపు కూలి దొరుకుద్దో లెదో అని
దొరికినా ఎన్ని రోజులో అని
నాకిచ్చే రూపాయి నిజమైందో కాదో అని.

ఇన్ని చిరుగుల గుడ్డ ముక్కతో రేపు ప్రపంచ దేశాలతో సహ పంక్తి భొజనము లో ఎలా కూర్చోవాలా అని? "

3, డిసెంబర్ 2008, బుధవారం

పత్రికలు, రాజకీయాలు, ఉగ్రవాదం.

ఈ మధ్య కాలం లో అంటే 27 నవంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని నరరూప రాక్షసుల పైనా, P.O.K పైన సైనిక చర్య జరుపుతారా అని ఎదురు చుస్తూ కళ్ళు పత్తి కాయలు అయ్యాయి.అంతర్జాతీయ సంఘీభావం కూడగట్టుకోడానికి,సైన్యాన్ని సమాయత్త పరచడానికి కొంత సమయము పడుతుంది కాబట్టి ఇప్పటిదాక ఆగారేమో. అయినా యుద్ధానికి సన్నద్ధమయ్యె వాళ్ళు చెప్పి చెయ్యరు కదా? ఇదీ అంతే.నాకైతే మొఖాన ఉమ్మేసినా పట్టించుకోని రాజకీయ నాయకులు ఇప్పుడు Elections వస్తున్నాయి కబట్టి తప్పకుండ యుద్ధ భేరీ మోగిస్తారని పిస్తుంది.

ఇక పాకిస్తాన్ విషయనికి వస్తే తను పెంచి పోషించిన లష్కరే ఇప్పుడు పక్కలో బల్లెమై కూర్చింది.పాకిస్తాన్ లో 1947 నుంచి ఈ రోజుదాక ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే.ఈ పరిస్థితుల్లో లష్కర్ ముష్కరులు ప్రభుత్వము మాట వింటారా? అప్పటికి పాకిస్తాన్ ఆమెరికా మీద వత్తిడి ద్వారా భారత్ ను అణచాలని చూసింది."నేను సైన్యాన్ని ఆఫ్ఘన్ సరిహద్దులనుంచి P.O.K కి మారుస్తా అంది". ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ఇప్పటిదాక పాకిస్తాన్ సహయం తో ఆఫ్ఘనిస్తాన్ లో నెగ్గుకొస్తుంది.మరి పాకి సైన్యం లేకపొతే మళ్ళీ లాడెన్ చెలరేగిపోతాడు.దీన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ అమేరికాను ఇన్నిరోజులు blackmail చేస్తూ వస్తుంది.ఇది October లో జరిగిన USA presidential డిబేట్ లో కూడా దరిదాపు మెకైన్,ఒబామా ల అభిప్రాయం.అయితే పాకిస్తాన్ పాచిక ఈ సారి పారలేదు.రహస్య ఎజెండా ఏదైనా కాని ఈ మధ్య ఎందుకనో USA భారత దేశానికి దగ్గర అవుతున్నట్టనిపిస్తుంది.

పాకిస్తాన్ కి ఎవరూ సహాయ పడుతున్న సూచనలు లేవు. కానీ యుద్ధమంటూ వస్తే తప్పకుండా బయటికి చెప్పకుండా చైనా సహకరిస్తుంది.ఎవరు అవునన్నా కాదన్నా పైకి చూడ్డానికి అన్నిటిలో పోటీ ఇండియా - పాకిస్తాన్ లమధ్య లా వున్నా నిజానికి అది ఇండియా - చైనా ల మధ్యే అన్నది కఠోర వాస్తవం.

ఒక వేళ యుద్దమే వస్తే అమెరికా భారత్ కి ఒక చిన్న సహాయము చేస్తే చాలు.అది "ప్రస్తుతము అందరికీ చెప్పి కొంత చెప్పకుండా కొంత వివిధ రూపాల్లో పాకిస్తాన్ కి ఇస్తున్న సహాయం ఆపేస్తే చాలు". ఇండియా చేయాల్సిందల్లా భరత భూమిలో పుట్టి పాకిస్తాన్ ను సశ్య శ్యామలం చేస్తున్న జీవ నదులను భారత భూమి దాహాన్ని తీర్చడానికి మళ్ళిస్తే చాలు ఆర్ధికంగా అంతంత మాత్రానే వున్న పాకిస్తాన్ కుదేలైపొవటనికి. కాకపొతే దీంతో ఉగ్రవాదము నశించక పోగా ఇంకా పేట్రేగి పోవచ్చు.ఆకలితో వున్న మనిషి కడుపు నింపుకోవడానికి దేనికైనా సిద్ధ్హ పడతాడు. సోమాలియా సముద్ర దొంగలు ఇందుకు ఉదాహరణ.

ఇప్పుడు చిక్కల్లా పాకిస్తాన్ ISI ని కాని,సైన్యాన్ని కాని, ఉగ్రవాదులని కాని అదుపు చేయలేదు.అలా అని అది రాజకీయ కారణాలవల్ల ఒప్పుకోనూ లేదు.పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదులను వొదిలించుకోవాలంటే దానికి మిగిలిన ఒకే ఒక మార్గము , ఇండియా యుద్ధము తలపెడితే చూసీ చూడనట్టు వుండడమే.లేదంటే మన ఆర్ధిక వ్యవస్థ ఎలా వున్నా, పాకిస్తాన్ లో యుద్ధానంతర పరిణామలు అతి భయంకరంగా ఉండవచ్చు.అరాచకత్వం తో సామాన్య జన జీవనానికి కోలుకోలేని దెబ్బ.

ఇక మన విషయానికి వస్తే మన పత్రికలు చేసిన హంగమా చూసి నిజమా అని నన్ను నేను ఒకటికి పదిసార్లు రక్తము కారే దాక గిల్లుకోని చూసుకున్నాను. మనది నిజంగా విజయమా? అనామకులెవరో వచ్చి 190 మందిని పొట్టన పెట్టుకోవడము అడ్డుకోలేక పోయాము. N.S.G దళానికి సరైన విమానమే కరువైంది.ముఖ్య మంత్రి, హోం మంత్రు ల సంభాషణ(పేపర్లలో వచ్చినదాన్ని బట్టి) ముత్యాలు రాలి పొతాయన్నట్టు మహా క్లుప్తం.సందిట్లో సడేమియా లాగా ముఖ్య మంత్రి గారి ఇలాకు వాళ్ళకి తాజ్ లో రెడ్ కార్పెట్.

T.V వాళ్ళు , పత్రికల వాళ్ళు నాలాగా ఎవడికి తోచింది వాళ్ళు రాసారు.నాకొచ్చిన అనుమానాలు కూడా పత్రికా మేధావులకు రాక పొవడము నిజంగా నాకు ఆశ్చర్య మేసింది.

మనకు తెలిసి మొదటి రోజున ఏదో ముంబై పత్రికలో ఒక ఉగ్రవాది ఫొటో వేసారు.నేటికీ అందరూ అనుకొనేది ఒకడే దొరికాడని. క్రైం డిపార్టుమెంటు ఇలాంటివి ఎలాగూ బహిర్గత పరచరు కాబట్టి వాళ్ళు పట్టుకొన్నది ఎంతమందినైనా ఒక్కడనే చెప్తారు.అలాగే కథను కూడా అల్లుతారు.

ఎంతమందిని పట్టుకున్నా చెప్పింది ఒకడే దొరికాడు అని కాబట్టి మిగిలిన వాళ్ళని ఏరకమైన ఒత్తిడులు లేకుండా కాల్చి అవతల పడేయొచ్చు. లేదా అవసరమైన పక్షంలో విడిచి పెట్టవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు.

శవాలు 9, దొరికింది ఒక్కడు కాబట్టి లెక్క ప్రకారము వచ్చింది 10.కానీ లెక్క ఎంత గందరగోళంగా వున్నా మొదటి రెండు రోజులూ అందరి ఏకాభిప్రాయము 15.అంటే మిగిలిన వాళ్ళు దొరికారా? పారి పోయారా?

ఇప్పటిదాకా సామాన్యులు ఎంతమంది చనిపోయారో ఎవరి సంబంధీకులో ఏ పత్రికైనా రాసిందా?

సముద్ర యానం శ్రమతో కూడుకున్నది,రాగనే విధ్వంస్యం ఎలా మొదులెట్టారు?

అంత మందు గుండు సామాగ్రి తాజ్ లోకి ఎలా తీసుకెళ్ళ గలిగారు? ( ఈ ప్రశ్నకి ఇప్పటిదాకా నాకు సమాధానం దొరకలేదు)

వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినది ఏ దెశస్థుడు? ఇన్ని తెలుసుకున్న పోలీస్ ఇది తెలుసుకోలేదా?

-----------------???????????????????????????????????-----------------