27, ఆగస్టు 2012, సోమవారం

ఒక పేజీని చూడకుండానే ఆ పేజీలో ఏమేమి వుండగలవో ఎలా ఊహించవచ్చు?



 పైన చూపించినది ఒక స్కాన్ చేసిన పేజి యొక్క హిస్టోగ్రామ్. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లైతే కొంత వరకూ ఆ స్కాన్ పేజీలో ఏమి వుండి వుండగలదో చెప్పవచ్చు.

1) Heading

2)  ఒత్తులు ( అక్షరాల క్రింద ఈ లైనులో ఒత్తులు ఎక్కువగా వుండి వుండవచ్చు )

3) paragraph space ( మొత్తం 5 paragraphs వున్నట్టున్నాయి )

4) poems/kavitalu or broken lines

5) పొల్లులు

6) longest line ( or more glyphs ) in the page

7) shorter lines  ( or less glyphs ) in the page

8)  space between heading and first line

బొమ్మలో చూపినట్లు ఓ మోస్తరుగా వెలుపలికి వచ్చిన నల్లచారలను లెక్కపెడితే అవి మొత్తం 22 వున్నాయి కాబట్టి ఆ పేజీలో మొత్తం 22 లైన్లు వున్నట్టు లెక్క.. హిస్టోగ్రామ్ లో రెండు నల్లటి చారల రేఖల మధ్య ఖాళీ ఏర్పడిందంటే  అక్కడ అక్షరాలు ఏమీ లేకుండా తెల్ల కాగితం మాత్రమే వుందని అర్థం. ఈ ఖాళీ ప్రదేశాలను పటంలో 8, 3 అంకెలతో సూచించాను.

3 వ నంబరు ఖాళీ ప్రదేశంతో పోలిస్తే 8 నంబరుకు ఖాళీ ప్రదేశం ఎక్కువ.  అంతే కాకుండా 1 వ నెంబరు నల్ల చారలు మొదటిలోనే పొట్టిగా వుండి దాని తరువాత ఎక్కువగా ఖాళీ ఏర్పడింది కాబట్టి 1 వ నెంబరుగా సూచించినది బహుశా పేజీ హెడ్డింగ్ లేదా పేజీ నెంబరు అయి వుండవచ్చు. అంటే shortened black stripes వున్న దగ్గర కొద్ది అక్షరాలు మాత్రమే వుంటాయని అర్థం. అదే పటంలో 6 వ నెంబరు గా చూపిన నల్లచారలు పొడవుగా వున్నాయి కాబట్టి scan చేసిన పేజీలో ఆ లైను ఎక్కువగా అక్షరాలను కల్గి వున్నదని అర్థం.

అలాగే ఖాళీ ప్రదేశం కూడా ఒకవేళ ఎక్కువగా వున్నట్లైతే దాన్ని పేరగ్రాఫ్ ఖాళీ గా భావించవచ్చు. ఈ  histogram చూస్తే అలాంటి పేరగ్రాఫ్ లు 5 వున్నట్టు తెలుస్తుంది.

పేజీలో నెంబరు 4 అంకెతో సూచించిన black stripes  పొట్టిగానూ ఇంచుమించు ఒకే పొడవులో వున్నాయి. మన తెలుగులో ఇలా నాలుగు లైన్లు వరుసగా ఒకే పొడవుతో పేజీలోని మిగిలిన black stripes  కంటే చిన్నవిగా కనిపిస్తే బహుశా అవి Broken sentences లేదా కవితలు లేదా పద్యా లైనా కావచ్చు.

హిస్తోగ్రామ్ లో ఒక్కో నల్ల చారల సమూహం ఒక్కో లైనును సూచిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే హిస్టోగ్రామ్ base వద్ద వెడల్పుగా వుండడం గమనించవచ్చు. తెలుగు వాక్యాలలో పొల్లులు ఒత్తులు ఎక్కువగా వుంటాయి. అవి ఎంత ఎక్కువగా వున్నాయన్న దానిపై హిస్టోగ్రామ్ లోని black stripes base అధారపడి వుంటుంది. అంటే ఒక వాక్యాన్ని తీసుకొని పొల్లులు, ఒత్తులు రాకుండా రెండు సమాంతర రేఖలు గీస్తే ఆ రెండు లైన్లకు పైన క్రింద ఏమేమి పొల్లులు లేదా ఒత్తులు వుంటాయో దానిపైన black stripes base అధారపడి వుంటుంది. వాటిని 5 వ నెంబరు, 2 వ నెంబరు తో సూచించాను. సహజంగా వాక్యము మధ్యభాగంలో అక్షరాలు వుండే అవకాశం ఎక్కువ కాబట్టి black stripes మధ్యభాగాన పొడవుగా వుంటాయి.

ఉదాహరణ



ఇప్పుడు పైన చెప్పుకున్న హిస్టోగ్రామ్ యొక్క అసలు పేజీ ఇది




ఈ క్రింద మరో హిస్టోగ్రామ్ ను దానికి సంబంధించిన పేజీని ఇస్తున్నాను.




15, ఆగస్టు 2012, బుధవారం

స్వరాజ్యం - స్వాతంత్ర్యం - సురాజ్యం



భారత దేశ చరిత్రలో 1947 ఆగష్టు 15 వతేది సంవత్సరానికొక్క రోజైనా సంస్మరణీయ దినం. పల్లె టూళ్ళలో ప్రభుత్వపాఠశాలలు దివ్యంగా వెలుగుతున్న రోజుల్లో పిల్లలైతే ఆరోజు కోసం ముందుగా ఓ పది రోజులనుండే స్కూలు గోడలకు సున్నము వేయించడం దగ్గరనుండి, ప్రతిక్లాసులో రంగు కాగితాలనంటించడం, వక్తృత్వ పోటీలకు సన్నద్ధులవడము, స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాట్లాడడానికి ముందుగా రిహార్సల్స్ చేసుకోవడం లాంటి తీరిక లేని పనులతో గడిపేవారు. అమ్మాయిలైతే ప్రతిరోజూ ఆలపించే "మాతెలుగు తల్లికి" పాటతోపాటు హిందీ గీతమైన "ఝండా ఊంఛా రహే హమారా" లతో కుస్తీ పట్టడం కూడా జరుగుతుండేవి. హిందీ, ఇంగ్లీషు అయ్యవార్లైతే క్లాసులో ఒక మంచి చురుకైన విద్యార్థినెన్నుకొని హిందీ, ఇంగ్లీషుల్లో స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాన్ని కంఠతా పెట్టించి వారిచేత ఆరోజు ప్రసంగించే ఏర్పాట్లు చేసేవారు. ఆ ప్రసంగాన్ని విని తృప్తిగా విద్యార్థిని ఆశీర్వదించేవాళ్ళు కూడా! ఇదంతా ఒక ఎత్తైతే Physical Education  Period మరో ఆనందకరమైన సన్ని వేశం. సావ్ ధాన్, విశ్రమ్ లతో కొద్దిపాటి కవాతును చేయడానికి పిల్లలకు తర్ఫీదును కూడా ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా C.P.L ( class pupil leader ), S.P.L ( school pupil leader ) లు Head Master కు వందన ప్రమాణాలు చేసే సన్నివేశం చాలా బాగుంటుంది. ఉన్న వాటిలో శుభ్రమైన తెల్ల రంగు చొక్కాలు ధరించి పిల్లలంతా వచ్చేవాళ్ళు.  బహుశా రెండులోనో, మూడులోనో అనుకుంటా ఈ స్వాతంత్ర్యదినోత్సవం గురించి నాకు పరిచయమవ్వడం జరిగింది. అదికూడా Elementary school  ప్రక్కనే వున్న High school లో చాక్లెట్లు పంచుతున్నారని  పిల్లలందరిని తీసుకొని వెళ్ళారు. ఆ మరుసటి రోజు మా అయ్యవారు స్వాతంత్ర్యదినోత్సవాన్ని గురించి చెప్తూ గాంధీ, నేతాజీ, నెహ్రూ లగురించి కూడా వివరించారు. చాక్లెట్లు పంచడంవల్ల అప్పటి సన్నివేశం బాగా గుర్తుండి పోయింది. అప్పటినుండి ఎప్పుడెప్పుడు హైస్కూల్ కు వెళదామా అని ఒకటే ఆరాటం.

" నేటితో మనకు స్వాతంత్ర్యమొచ్చి 38 సంవత్సరాలు పూర్తయిందంటూ" మొదలయ్యే ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకొనే విదంగా సాంతంత్ర్య సాధనలో అసువులు బాసిన నాయకుల జీవిత చరిత్రనుంచి స్ఫూర్తి పొందే విధంగా సాగేవి. మధ్యమధ్యలో ఆవేశ పూరితమైన కవితా ప్రసంగాలూ వుండేవి. స్వచ్ఛమైన పిల్లల మనసులో సమసమాజ బీజాక్షరాలనూ ఇక్కడే నాటేవారు. ( అది స్కూలు వరకే పరిమితం. స్కూలు నుంచి పై చదువులకని విశ్వవిద్యాలయాలకు వెళ్ళగానే పూర్తి ప్రపంచం కనిపిస్తుంది లెండి ).

బహుమతుల ప్రదానోత్సవము కూడా అయ్యాక, క్రమశిక్షణ గల సైనికుల్లా ఎవరిక్లాసుకు వాళ్ళు వెళ్ళేవారు. ఒక్కసారి చాక్లెట్లు చేతిలో పడగానే  ఇంటివైపు పరుగోపరుగు. మరుసటి రోజు స్కూలుకొచ్చాక అందంగా కనిపించే స్కూలుని చూసి లోలోపల మురిసేవాళ్ళం కూడా. అది ఆనాటి మాట.

రాను రానూ పాఠశాలల్లోకి రాజకీయాలు ప్రవేశించాయి. అయ్యవార్లు రాజకీయ ప్రతినిధులుగా మారారు. విద్యార్థికీ, ఉపాధ్యాయునికీ వుండవలసిన సత్సాంగత్యము కూడా చెడుతూ వచ్చింది. ప్రసారమాధ్యమాల హోరు వల్లనైతేనేమీ, మారుతున్న జీవన విధానాలవల్ల నైతేనేమీ  పెద్దల తో పాటు పిల్లల మనసులు కూడా సున్నితత్త్వాన్ని కోల్పోతున్నట్టున్నాయి. స్వాతంత్ర్యదినోత్సవం పాతబడిపోయి "ఆ స్వాతంత్ర్యదినోత్సవమా" అనే స్థాయికి వచ్చాము. ప్రజాస్వామ్యంలో వున్నా మనకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియదని చెప్పుకోవాలేమో !.  స్వాతంత్ర్యం కూడా సరిగా అర్థమవక విచ్చలవిడి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామేమో !

భారత పౌరులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని పోరాడిన నాయకులు రాజ్యార్హతకు భారతపౌరసత్వాన్ని కొంత కఠినతరం చేసి వుంటే బాగుండేది. స్వారాజ్యం, స్వాతంత్ర్యంలతో పాటు సురాజ్యము మనకు కావాలి. నాయకులలో చిత్తశుద్ధి పెరిగే విధంగా ప్రజలతీర్పు వుంటే బాగుంటుంది. కానీ 1947 నాటి పరిస్థితులతో పోలిస్తే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ప్రజలకు ముఖ్యమైన విద్య, ఆరోగ్యం ఓ రెండు దశాబ్దాలవరకూ అభివృద్ధి సాధించినట్లే వున్నది కానీ నేడు అవిరెండూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చల్లగా జారుకుంటున్నాయి. ప్రైవేటు వ్యవస్థలకు ఆదాయం ముఖ్యము కాబట్టి రాబోవుకాలాలలో పేదవాడు చదువుకు, ఆరోగ్యానికి దూరం కావచ్చు. అలాగే  విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణాలలో ప్రభుత్వం మొదటినుంచి దారుణంగా విఫలమయ్యింది. ప్రైవేటు వ్యవస్థల వల్ల ఇవి కొంతవరకూ మెరుగైనాయని చెప్పవచ్చు.

ఇక ఆన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం. దీనికి మనదేశంలో ఇప్పుడొచ్చే నష్టమంటూ ఏమీలేదు. అంటే సైనిక పరిపాలన రాదు.  కానీ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని Manipulate చేసే స్థాయికి ఎదిగారు. ప్రజాస్వామ్యానికి ఈనాడు నిజమైన అడ్డంకి ప్రచార సాధనాలే. ఏ ఒక్క పేపరు కానీ, ఛానలు కానీ స్వప్రయోజనాలు లేనిదే వార్త ప్రచురించండం లేదు. ఏది వార్తో, ఏది అభిప్రాయమో, ఏది ప్రకటనో తెలియకుండా ప్రచారసాధనాలు జాగ్రత్త పడుతూ తమవారికి మేలు చేసే విధంగా చెమటోడ్చి కష్టపడుతున్నాయి. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనీయకుండా అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వమున్నది ప్రజలకోసం అని ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారు. ప్రభత్వం ఏదో చేసి వాళ్ళ బ్రతుకులను మార్చుతుందన్న అపోహలూ ఇప్పుడు ప్రజలలో లేవు. ఏనాడైతే ప్రజలు ఎన్నికల పట్ల విముఖత చూపుతున్నారో ఆనాడే దేశంలో ప్రజాస్వామ్య ఆనవాళ్ళు  దిగజారుతున్నాయని చెప్పవచ్చు.

ఇంతకుముందు రాజకీయనాయకుల మాటలలో Secular state అనే పదమన్నా వినిపించేది. ఇప్పుడు దాని స్థానంలో so called  "సామాజిక న్యాయం" అనే Posh పదం వచ్చి చేరింది. పుట్టుకతో వచ్చిన కులం, రాజరిక వ్యవస్థను పోలిన అధికారం మొదలైన అనాదిగా వస్తున్న ఆచారాలే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి.

స్వార్థ రహిత పరపీడన పరాయణత్వం సహింపని అమృత లాంఛనం మన ధర్మచక్రం. సమత, స్వాతంత్ర్యం సౌఖ్యం సూచించే త్రివర్ణ పతాకం మనది. త్రవర్ణ రేఖల మధ్య భాషించే ధర్మచక్రాన్ని రక్షిచడం భారత పౌరుల ధర్మం

జై భారత్.





14, ఆగస్టు 2012, మంగళవారం

1915 వ సంవత్సరపు మూడవతరగతి తెలుగు వాచకంలో నుంచి ఓ కథ.

ఓ సంవత్సరం క్రితం Download చేసిన ఓ తెలుగు పుస్తకము ఒకటి ఈ రోజు కంట్లో పడింది. చూస్తే ఈ పుస్తకం 1915 వ సంవత్సరంలో మొదటి మూడు తరగతులకు నిర్దేశించబడిన తెలుగు పుస్తకం. ఆరోజుల్లో అంటే ఒకే ఒక్క తరం ముందు మూడవతరగతి తెలుగు ఇలా వుండేదన్న మాట. 100 సంవత్సరాలలోనే ఇంతగా మార్పు !!! బహుశా 1960/1970 ల వరకూ తెలుగువాచకాలకు  ఇదే ప్రమాణాలు పాటించేవారేమో.

ఆ పుస్తకంలోనుండి ఓ కథ ఇది.






ఈ క్రింద పై పాఠానికి లఘు టీక 



11, ఆగస్టు 2012, శనివారం

ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్థుల ర్యాంగింగ్ లో అతి ముఖ్యమైన ప్రశ్న


అసలే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మొదలయ్యే సమయం. పుష్కలంగా మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరే సమయం. 2nd year కు వచ్చిన వారు కొత్త బ్యాచ్ ఎప్పుడెప్పుడు చేరుతుందా ఎప్పుడెప్పుడు Ragging చేద్దామా అని పంచెలు ఎగకట్టి మరీ ఎదురు చూస్తుంటారు కాబట్టి కొత్త విద్యార్థుల ర్యాంగింగ్ లో తప్పక వుండే అంశం "అమ్మాయి వర్ణన" అలాంటి అమ్మాయి వర్ణన వారికోసం ఇక్కడ

ఇప్పుడంటే తుపాకులు, మిస్సైల్స్, ఆటంబాంబులు వచ్చాయి కానీ పూర్వకాలంలో ఒకరాజ్యాన్ని మరో రాజ్యం జయించాలంటే విల్లంబులతో బాణప్రయోగాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి మిస్సైల్స్ అయినా అప్పటి బాణాలైనా శత్రువుకు దూరంగా వుండి ప్రయోగించడము మూలానే
 వీటికి అంతటి ప్రాముఖ్యత.  అంతటి ప్రాముఖ్యత గల విల్లంబులను ఓ సొగసరి కనుబొమలతో పోలిస్తే? అది కూడా ఒకే కాలంలో పదునాల్గు లోకాలను జయించగల విల్లంబులతో పోలిస్తే?

నదీ ప్రవాహంలో తెప్పలు తేలుతూ వెళుతుంటాయి. నదిలో నీరు ప్రధానం. నీటికి ప్రవాహం సహజగుణము. అదే కాంతి ప్రవాహమైతే? ఆ ప్రవాహంలో ఈదుతున్న కుండతెప్పలైతే? ఆ తెప్పలు కూడా రాత్రివరకూ కనిపించలేదంటూ యౌవన ఉదయముతో ఉద్భవించిన ఇంతి స్థనములైతే? అంటే అమ్మాయిలకు వయసు వచ్చేకొంది స్థన సంపద వృద్ధి అవుతుందని కవితాత్మకంగా చెప్పడం. ఆ కాంతి ప్రవాహంలో మన్మధులు ఈదులాడుతూ వుంటారు.

ఆ కమలముఖి యొక్క నడుము ఇంతయే. ఇంతయే అంటే పిడికిలిలో ఇమిడేతంటటి చిన్నది. అలాంటి నడుమును చేటి వేళ్ళతో పట్టుకోగా వ్రేళ్ళ సందులలో నుంచి ఉబికిన భాగములే నడుము ముడతలైతే?

ఇక ఆ ఇందువదన కురలైతే యవ్వనములోనున్న మనసు లనే లేళ్ళ సమూహమును కట్టి పడేసే మన్మధకురులైతే? వేటకాని వలలో లేళ్ళు పడినట్టు ఈ ఇంతి కురులలో యౌవ్వనవంతులైన వారి మనస్సులు చిక్కుకు పోతే?


ఆమె పాదముల అడుగులు సూర్యుని వరప్రభావముచేత పుట్టినటువంటి పంకజములే. తామరపూలు సున్నితత్వానికి సూచిక. ఇక్కడ ఆమె కాలి అడుగులు కూడా అంతే సున్నితము.

ఇన్ని సంపదలు ఆ దేవుడు ఈ సుందరాంగికి చేకూర్చి విభజన రేఖను స్పష్టపరిచాడు మరి. అంటే biological గా ఇన్ని మార్పులు చేకూరిన తరువాతే యవ్వనవతి... దానికి పూర్వ మంతా బాల్యమే. బ్రహ్మ గీసిన ఈ  విభజనరేఖ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ చంద్రముఖి జవ్వనియే.



వర్ణనలో ఇది ఒక భాగము మాత్రమే !! ఇంతటి వర్ణనా చాతుర్యమెవ్వరికుంటుంది ఒక్క శ్రీనాధునికి తప్ప. అదీ శ్రీనాధుని సీసమైతే.....
భావము తెలిసిన తరువాత, పైన వ్రాసిన వాక్యాలకంటే ఈ క్రింది పద్యము ఎంత మనోహరమో చూడండి.



జగము లొక్కుమ్మడి సాధింపనెత్తిన రతి మన్మథుల విండ్లు రమణి బొమలు
కాంతి నిర్ఝరమీదు కామయౌవనముల కుంభప్లవము లింతి కుచయుగంబు
నడుమింత యని కేలదొడికి పట్టిన ధాత యంగుళిరేఖ లబ్జాస్యవళులు
యువమనోమృగరాజి దవిలింప దీర్చిన మదనవాగుర లిందువదన కురులు

బాల్యతారుణ్య సీమా విభాగమునకు
నజుడు వ్రాసినరేఖ తన్వంగియారు
భానువరమున బడసిన పంకజముల
యపర జన్మంబు పూఁబోడి యడుగు లధిప

10, ఆగస్టు 2012, శుక్రవారం

కళా సౌందర్యము - కావ్య సౌందర్యము - 2

మనిషి తన పరిశరాల ప్రభావానికి లోనై దాని ప్రోద్బలంవలన సుఖదుఃఖాల సమ్మేళనాన్ని అనుభవిస్తుంటాడు. ప్రకృతి నుండి మనిషి ఉదయించడం వలననేమో మానవుని హృదయం ప్రకృతి ధర్మాలను ప్రతిబింబింపచేసే దర్పణము. ప్రకృతి, పరిశరాల ప్రోద్బలంతో ఆనందానుభూతిచే ప్రభావితుడై ఏకాంతంగా మనసు విప్పి ప్రకృతితో  చర్చిస్తుంటాడు. కొన్ని సందర్భాలలో సత్యస్వరూపాన్ని శ్రవణానందంగా అంతరంగంలో గానం చేస్తూ గడిపేస్తుండవచ్చు కూడా. ఆ సత్యస్వరూపం మనసుదాటి స్వరరూపం సంతరించుకుంటే కవిత్వమౌతుంది.

కవియొక్క భావమేఘాలు ప్రపంచమంతటా ఆవరించి అలుపెరుగక సంచరిస్తుంటాయి. మనఃప్రేరేపితముతో స్వేచ్ఛగా ఏభావప్రపంచంలో సంచరించడానికి అవకాశమున్నదో అచటికల్లా ప్రయాణమౌతాడు. పయనించి ఏకాంతంలో అనుభవించినదంతా కవితారూపంలో రంగరించి కావ్యాన్ని రచిస్తాడు. ఆలోచనలు, అనుభూతులూ సామాన్య మానవులకూ వుంటాయి. కానీ ఈ జగతికి ప్రాణాభూతమైనది ఆత్మ. చేతనాచేతనలకు మూలమూ ఆత్మనే. కవి అంతరంగంలో ఈ సాదృశ్యమైన తత్వాన్ని చూస్తాడేమో. అందుకే చాలా కావ్యాలలో తత్త్వానుభూతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది కూడా.

మనస్సు నివురుగప్పిన నిప్పులాంటిది. ప్రకృతిలో లీనమైన మనిషికి అచేతనావస్థలో మనస్సు తాత్కాలిక తేజస్సుతో విరాజిల్లి ఆ అమృతమయమైన క్షణాలలో మహత్తర కవిత్వము వెలువడుతుంది. ఆ కవిత స్పృశించిన ప్రతి విషయమూ స్వర్ణమయము. ఆ సమయంలోనే లయ/ఛందోబద్ధమైన కవిత్వం అలవోకగా పలుకుతుంది.

కొందరు శబ్దార్థాలతో కూడినది కవిత్వమన్నారు. మరికొందరు ఇష్టార్థములతో, అలంకారములతో  కూడుకున్నదాన్ని కవిత్వమన్నారు. మరికొంత ముందుకెళ్ళి మాధుర్యము, ప్రసాద, శ్లేష,సమాధి,ఔదార్యము,సుకుమారము, కాంతి సమములతో కూడి దోషములు లేనిదాన్ని కవిత్వమన్నారు.  అంతటితో ఆగక "వాక్యం రసాత్మకం కావ్యం" అని అన్నారు.

అలంకారికులు కావ్యాన్ని స్త్రీ తో పోల్చారు. స్త్రీ సౌందర్య రూపిణి. ప్రాణం కలిగినది. అలాగే కావ్యానికి ప్రాణం కావాలన్నారు. ఆ ప్రాణమేదన్నదానిపై భిన్నాభిప్రాయాల వలన అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే వికృతంగా వున్న దానిని కూడా సుందరంగా చూపించే ప్రక్రియే కవిత్వమేమో. వైకల్యంలో కూడా తత్త్వం అంతర్లీనం. తత్త్వం సుందర రూపం. అందుకే అలాంటి కవిత్వం చదవగానే మానసికోద్బోధన చేసి పరిచ్ఛిన్నత్వమును తొలిగిస్తుంది. మన భావనాపరిధులను విశాలం చేసే మనోవికాశం కవిత్వం. సత్యసౌందర్యముల ఆవేశమే కవిత్వం. అనుభూతి, అవేశము, భావము, ఊహ సమ్మేళనమే కవిత్వము. నవరసాలు కవితాకన్యకు ఆభరణాలు.

9, ఆగస్టు 2012, గురువారం

కళా సౌందర్యము - కావ్య సౌందర్యము



శతాబ్దాల తెలుగు చరిత్రలో మహా మహా కావ్యాలు వెలువడ్డాయి.సర్వలక్షణ సమన్వితమై వున్న కావ్యాలూ చాలానే వుండవచ్చు. వ్యాకరణ, అలంకార,సాహిత్య భూషితమై కావ్యం లాక్షణికుల మన్ననలను పొందవచ్చు. వీటన్నింటినీ మించి ఆ కావ్యంలో  సౌందర్యము లోపించినట్లైతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. చాలాసార్లు ఓ తెలుగు కావ్యాన్ని చెప్పగానే అది శృంగార కావ్యమా లేదా భక్తి కావ్యమా లేదా మరొకటా అని విభజన చేసేస్తుంటాము కానీ, నిజానికి నవరస కళా సౌందర్యము లేని ఏ కావ్యమైనా క్షరము కాక తప్పదు. మానవుడు తన పరిశరాల ప్రభావంతో తన ఆలోచనా పరిధులకు లోబడి మాత్రమే కావ్యాన్ని కానీ, చిత్రాన్ని కానీ, గానాన్ని కానీ ఆస్వాదించగలడు. ఈ సౌందర్యారాధన, దాని ఆస్వాదన, ఆయారంగాలలో తను చేసే కృషిపైన కూడా ఆధారపడే వుంటుంది. ప్రతిమనిషీ సౌందర్యారాధకుడే. ప్రతి జీవీ ఆ కళాసౌందర్యాన్ని ఏదో ఒకనాడు అలౌకికంగా అనుభవించినవాడే. ప్రతి వ్యక్తీ కోపము, ఆనందమూ, దుఃఖము, దయ,  మున్నగు విశేషణాలకు లోబడి చరించువాడే. ఇవన్నీ నిత్యజీవితంలో మనకు అనుభవపూర్వకాలే. ఆ సందర్భాలలో అనుభవపూర్వకంగా ప్రతివాని నోటినుండి వాక్యాలు మాటల గుచ్ఛాలుగా వెలువడుతూనే వుంటాయి. కానీ ఈ వాక్యాలు కవిత్వము కాదుకదా? మరి కవిత్వమంటే ? ఛందోబద్ధముగా వ్రాస్తే కవిత్వమా ? లేదా వాక్యాలను  కుళ్ళబొడిచి విడివిడిగా వ్రాస్తే కవిత్వమా? దేన్ని కవిత్వమంటారు?  మనఃచలనము మూలంగా కలిగిన తాత్కాలిక భావాన్ని క్రమబద్ధీకరించి సౌందర్యముగా చెప్పినదే కవిత్వమేమో !!

కావ్యానికి సౌందర్యము కావాలి. సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి భాషకావాలి. అదికూడా క్రమబద్ధంగా వుంటేనే రాణిస్తుంది. మన:చలనము వలన కలిగే భావాలు అస్పష్టంగా వుంటాయి. అస్పష్టంగా  వున్నా సరే ఆ వ్యక్తి తన మనసులో కల్గిన భావాన్ని తప్పక అనుభవిస్తాడు. కవికి, పాఠకునికి తేడా ఇక్కడే!! కవి తను తన మనసులో అస్పష్టంగా, చెల్లా చెదురుగా వుద్భవించిన భావాన్నిసౌందర్యంగా  అక్షర బద్ధం చేసి ఇవ్వగలడు. అదే సౌందర్యాన్ని పాఠకుడు చూడగలడా/అనుభవించగలడా లేదా అన్నది పాఠకుని రస పిపాసపై అధారపడి వుంటుంది. అంటే రచయిత భావనావీధుల వెంట తిరుగాడుతూ తను చూసే భావచిత్రాన్ని పాఠకుని హృదయ ఫలకముపై ఎంతగా ఆవిష్కరించబడితే రచయిత అంత సఫలమైనాడని చెప్పవచ్చు. ఇది ఒక్క కావ్యానికే కాదు, చిత్రం, గానం లాంటి కళలకూ వర్తింస్తుంది.

విద్యుద్దీప కాంతులు ఇంటి లోగిళ్ళల్లో ధగధగలుగా మెరువక ముందువరకూ నిరుపేద చూసే పున్నమీ , శ్రీమంతుడు చూసే పున్నమీ ఒకే రకంగా వుండేవేమో. ఆ పున్నమిని ఇద్దరూ ఒకే రకంగా ఆస్వాదించేవారేమో. కానీ ఇప్పుడు వీరిరువురూ వేరు వేరు. వెన్నెల రాత్రులే తెలియని వాడు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడమూ అత్యంత సహజం కూడా !! అందుకే  నేటి తరానికి తగ్గట్టు కవిత్వమూ మారుతూ వస్తుంది.

3, ఆగస్టు 2012, శుక్రవారం

Smart Phones - Native Vs Mobile applications

ఆధునిక యుగంలో మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం మొదటి Apple ఐఫోన్ విడుదలతో ప్రారంభమైంది. ఓ రకంగా దీని పుట్టుక 2007 వేసవి. దీనితో "going mobile" అనే కొత్త పదం కూడా బయలుదేరింది. నిజానికి రాబోయే మరో దశాబ్దం పాటు ఈ విప్లవం ఇలాగే కొనసాగవచ్చు. "Native Vs Mobile site " అని ఒక్కసారి గూగ్లింగ్, బింగిగ్  చేస్తే కుప్పలు కుప్పలు లింకులు కనిపిస్తాయి. వాటి నిండా ఎవరికి తోచిన భావాలు వాళ్ళు వ్రాసుకున్నారు. మరి నేనో !!! అందుకే నాకు తోచింది ఇక్కడ.

ఇంతకు Native application కి mobile site కు తేడా ఏంటి? ఇప్పుడు www.haaram.com ను ఏ మొబైల్ లో బ్రౌజ్ చేసినా వున్నంతలో  బాగానే కనిపిస్తుంది కదా? మరి దీన్ని Native application లో Develop చెయ్యడం వల్ల ఉపయోగాలేంటో వ్రాయాలంటే

1) A native application is much less exposed to network latency so, at times it may comeup quickly
2) Application can be viewed even in disconnected mode
3) It offers better user experience
4) In native applications we can  integrate well with the device and use hardware and built-in software services
5) Native applications are device specific ( for each device, we need a seperate application )

మరి మొబైల్ సైట్స్ గురించి చెప్పాలంటే
౧) A mobile site works by interacting with the web server. subsequently, it’s subject to network latency and may be sensitive to high-traffic slowdowns.
౨)  Off line mode may not be posible
3) we need to type URL in the browser, so its user experience and performance mainly depends on the supported browser
4) It is based on pure HTML
5) It is subjected to browser caching
6) It is cross plotform, meaning as long as browser supports HTML we just need one version of our application

ఇంకా.... చాలానే వుండొచ్చు.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే, చాలా సందర్భాలలో వీటి రెండింటికీ తేడా తెలియకుండానే " we want to move to smart phone" అనే వాక్యం తరచూ వినిపిస్తుంటుంది. సాధారణంగా దీనికి బీజం ఎక్కడ పడుతుందంటే ఎక్కడో ఏమీటింగులోనో ఏప్రయాణంలోనో కంపెనీలోని ఒక ముఖ్య వ్యక్తికి ఓ మంచి iPAD application కనిపిస్తుంది, అప్పటినుంచి పురుగు తొలిచేస్తుంటుంది. ఇంకేముంది నాలుగైదు మీటింగులైన తరువాత "going mobile" అయిపోతుంది. In the minds of most developers and managers, going mobile requires no more (and no less) than planning an iPhone application. infact it was a good approach for the past few years, but I doubt this strategy in future.

before going into the details of  Native Vs mobile sites,  here are the details of most popular mobile platforms






ఒకే ఒక్క common mobile platform API అయితే ఊహించలేము కానీ Cross-platform mobile development is the Holy Grail  people are seeking now a days and with Monotouch and monodroid, C# is evolving as a cross platform development language. This can be used  for Windows Phone, iPhone,and Android through Xamarin’s MonoTouch and MonoDroid platforms. కానీ ఇది ఎంతవరకు ఫలితాన్నిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. 


నన్నడిగితే iPhone development Objective C లో, Android Development java లోనూ చెయ్యమనే చెప్తాను. కారణం కామన్సెన్స్ అని తప్పుకుంటాను. నిజానికి ఈ కామన్సెన్స్ గురించి చెప్పడమనేది చాలా వాటికన్నా కష్టమైన పని.

అలాగే Phonegap and Titanium frameworks are also best  bets for mixed native and web features.

2, ఆగస్టు 2012, గురువారం

Baby - you are a devil's spawn


 First things first, Ever since I started my development in Eclipse, it keeps on testing my patience, p Pinches on my nerves. At times Close and restart eclipse . Delete previously loaded projects, to make sure I get errors only from the existing application. Not only that, it remember even deleted project errors. Intellisense... do you even call this as intellisense? I can go and pee before you respond with intellisense list.

Ohh..yeah, debugging is pain in the ass. I can't even list out f.... debugging/error window alignments.
 What not…. heck, I hate you Eclipse. You are not even close to what Visual studio offers to the windows community, not even worthy of standing in its shadow.



Second : Android Emulator sucks .. Why? There is no way to reload an Android application in the emulator without closing the emulator. Google hear us, you are releasing version after version, can you name at least one single version which is bug free and works with Eclipse? I better stick to Android version 2.2


Android in Eclipse environment totally sucks…why? Only God can list out all the problems with Android version 4.0 and later.

Over all my days are going wild with this gay baby. May be I am the only sufferer with this piece of shit. At last I vented out my frustration and now I can peacefully go home and sleep.

By the way now I understand why delivering a baby in java using Eclipse takes so long. yes, you guessed it right. They use few gay tools to deliver a baby without a female.