22, జులై 2013, సోమవారం

యం.బి.బి.యస్......సీటు చాలా సులువు గురూ....

ఈ రోజు సాక్షి నుంచి ఈ వ్యాసం...

 మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510

- మెడికల్ కాలేజీల కొత్త ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: ప్రతిభను బట్టే సీట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎలాంటి మార్గదర్శకాలు విధించినా.. ఆ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తూ సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే పన్నాగాలు మెడికల్ కాలేజీలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను పాటిస్తున్నట్లు నటిస్తూ దర్జాగా కోట్లు దండుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రతిభ ఉండి డబ్బులు లేని విద్యార్థులు ఎప్పటిలాగానే అన్యాయమైపోతున్నారు. యాజమాన్య కోటా సీట్లను ప్రతిభను బట్టే కేటాయించాలంటూ ప్రభుత్వం, కోర్టులు విధించిన నిబంధనలను ఉల్లంఘించటానికి ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు సరికొత్త దొంగదారి కనిపెట్టాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం వైద్య విద్య కోసం అర్హత ఉండి, ఎంతైనా ఖర్చు పెట్టగలవారితో పాటు.. అసలు ఆ సీట్లలో చేరటానికి అర్హత లేనివారికి గాలం వేసి ఇద్దరితోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారితో పాటు, అర్హతలేని డమ్మీ అభ్యర్థులను కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నాయి. ఇంకేముంది.. ఆ జాబితాలో భారీగా సొమ్ము చెల్లించిన అభ్యర్థులే మెరిట్ అభ్యర్థులుగా అధికారికంగా నిర్ణయించి వారికి సీట్లు కేటాయిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు ఇచ్చామంటూ ఆ దరఖాస్తుల జాబితాను చూపిస్తున్నాయి. ఈ రెండు రకాల విద్యార్థులను సమీకరించటానికి ఏకంగా దళారీ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కో విద్యార్థిని తీసుకొచ్చినందుకు సదరు దళారీకి రూ. 10 వేల వరకూ ముట్టజెపుతున్నాయి.

పేరుకే నిబంధనల అమలు...
రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించటంతో పాటు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రావాలి. కన్వీనర్ కోటాలో సీటు సంపాదించలేని విద్యార్థులు.. వారి ఆర్థిక స్తోమతును బట్టి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కోసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు.

చాలా ఏళ్లుగా వైద్య విద్య కళాశాలలకు ఈ కోటా కిందే భారీగా సొమ్ము లభిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కూడా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని, వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలు విధించింది. దాంతోపాటు ఈ సీట్ల భర్తీని పూర్తి పారదర్శకంగా చేపట్టాలని హైకోర్టు సైతం ఆదేశించింది. వీటన్నిటికీ విరుగుడు మంత్రంగా ప్రైవేటు కళాశాలలు దళారీల సాయంతో డమ్మీ అభ్యర్థులతో కనికట్టు చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నాయి.

‘మెరిట్’నూ సృష్టించటమే...
మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయాలనే నిబంధనలను ఉల్లంఘించేందుకు వైద్య కళాశాలల యాజమాన్యాలు ఓ వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి. ప్రతిభ కలిగిన సాధారణ విద్యార్థులకు దరఖాస్తులు ఇవ్వరు. దళారుల సహాయంతో.. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చి, ఎంసెట్‌లో 50 వేలలోపు ర్యాంకు సాధించి.. కనీసం రూ. 80 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఇచ్చే అభ్యర్థులతో మొదట బేరం కుదుర్చుకుంటారు. వారితో మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాలో వారికన్నా తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన, అర్హతలేని అభ్యర్థుల కోసం దళారులు వేట మొదలెడతారు. ఇంటర్‌లో నామమాత్రపు మార్కులొచ్చి, ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాకపోవటం వల్లో, ఎంబీబీఎస్‌పై అనాసక్తి వల్లో సాధారణ డిగ్రీలో చేరిన విద్యార్థులకు గాలం వేస్తారు. గత ఏడాది డిగ్రీలో చేరి ఈ ఏడాది ఎంసెట్ రాసిన వారినీ కలుస్తారు.

వారికి రెండు మూడు వేలు ఇస్తామంటూ ఆశ చూపి.. సదరు వైద్య విద్య కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటా కింద దరఖాస్తు చేయిస్తారు. చివరగా కాలేజీల యాజమాన్యాలు డబ్బిచ్చిన విద్యార్థులు, అర్హత లేని విద్యార్థులతో ఒకే జాబితా రూపొందిస్తాయి. పకడ్బందీగా రూపొందించిన ఈ జాబితాను ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పంపిస్తారు. ఇంకేముంది కళాశాలకు వచ్చిన దరఖాస్తులు, భర్తీ ప్రక్రియ అన్నీ ‘నిబంధనల ప్రకారం’ ఉన్నట్లే కనిపిస్తాయి. ఈ వైద్య విద్య కళాశాలలకు విద్యార్థులను సమీకరించే దళారులకు.. ఒక్కో అభ్యర్థిని తీసుకువచ్చినందుకు రూ. 10 వేల వరకూ ముట్టజెప్తున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలివీ...
- యాజమాన్య కోటా సీట్ల భర్తీ 2004 జూలై 23న ఇచ్చిన జీవో 217 ప్రకారం జరగాలి.
- జీవో ప్రకారం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ పాసవటంతో పాటు ఎంసెట్‌లో అర్హత సాధించాలి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 40 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.
- ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ నిర్ణయించాలి.
- ప్రతి కళాశాల భర్తీ ప్రక్రియకు ముందే ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాలి.
- అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు మెరిట్ ప్రకారం జాబితా తయారు చేయాలి.
- నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ వరకూ నిర్ణయించిన తేదీలోగా పూర్తి కావాలి.
- అడ్మిషన్ల ప్రక్రియ, అభ్యర్థుల జాబితా వివరాలు ప్రభుత్వానికి, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవ్వాలి.
- ఈ జాబితా పరిశీలన అనంతరం యూనివర్సిటీ అనుమతి ఇచ్చిన తర్వాతే భర్తీ జరగాలి.

ప్రైవేటు కళాశాలల్లో సీట్ల వివరాలు
మొత్తం ప్రైవేటు వైద్య కళాశాలలు 28
ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 3,400
యాజమాన్య కోటా సీట్లు 850
ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) సీట్లు 510 - See more at: http://sakshi.com/Main/Fullstory.aspx?catid=639410&Categoryid=1&subcatid=33#sthash.bBSYWx8Q.dpuf

2 కామెంట్‌లు:

  1. Ahmed Chowdary, I have received your comment in my mail. Not sure why the comment disappeared from this post.

    I can not add your logo in my blog. You may remove it from your aggregator.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బ్లాగ్ వేదికకు ఎక్కువుగా ప్రచారం కలిపించడంలోని భాగమే ఈ లోగో....అని గుర్తించగలరు.మంచి,మంచి బ్లాగులకు ఎప్పుడూ బ్లాగ్ వేదికలో చోటు ఉంటుందని తెలియజేస్తున్నాము.ఆఖరికి లోగో ఉన్నా లేకపోయినా...స్పందనకు కృతజ్ఞతలు.

      తొలగించండి

Comment Form