31, జనవరి 2013, గురువారం

సిరిమల్లె చెట్టు విశ్వరూపం.......



ఇక్కడికొచ్చిన మొదటిరోజు రెండో ఆటకే జరభద్రం బిడ్డో అని చెప్తున్నా వినకుండా అందరం ఎగేసుకుంటూ వెళ్ళాము. టిక్కెట్లు దొరుకుతాయో లేదో నని మధ్యమధ్యలో ఒకటే అనుమానం. మొత్తానికి సాధించి లోపలికెళ్ళాక ఎంత సేపటికీ సినిమా వెయ్యడే ! ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. సినిమాను ఇప్పటికే చీల్చి చండాడేసినారు కాబట్టి రాయడానికి పెద్దగా ఏమీలేదు కానీ సినిమా మొదలైనప్పటినుండి కథ కోసం ఎదురుచూడ్డం మొదలు. పోనీ కథలేకున్నా స్క్రీన్ ప్లే బాగున్నా సినిమా బయటికి వచ్చాక ఓ పాట, మూడు నాలుగు సీన్లన్నా గుర్తుండేవి. ఒకవేళ వున్నాయేమో సినిమా చూసి మూడువారాలైంది కాబట్టి గుర్తుకూడా లేవు. గుర్తు తెచ్చుకోకుండా మనసులో మెదిలే సన్నివేశం ఒక్కటికూడా గుర్తుకు రావటంలేదు.

పిల్లలతో వెళుతున్నాము కాబట్టి కుటుంబ కథా చిత్రంగా కాస్తంత బంధువుల హడావిడి ఊహించుకోని పోయ్యా. అలాగే టైటిల్ చూసి మంచి గ్రామీణ వాతావరణ సినిమా అనుకోవడం వల్ల కూడా దెబ్బైపోయింది. కాకుంటే సుమోలు లేవడాలు, లారీల జనాలను ఇరగెయ్యడాలు చూసి చూసి బోరుకొట్టడం వల్ల ఏదో క్రొత్తగా వుంది. సినిమా ఎలా వున్నా ఈ సినిమాకు నాలాగే చాలామంది వెళ్ళి చూస్తారు కాబట్టి  హిట్ అవ్వడంలో సందేహమేమీ వుండదు కానీ డైరక్టర్ కథ, సినిమా టేకింగ్ పట్ల ఏమాత్రం శ్రద్ధతీసుకొని వున్నా ఇంతకు రెట్టింపు హిట్ అయి వుండేది. సిరిమల్లెల గుభాళింపు కొద్దిరోజిలైనా గుర్తుండేది.

ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకంటే  మేము భారతదేశానికి వెలుపల వుండడం వల్ల ఈ శనివారం "విశ్వరూపం" చూసే అదృష్టం కలుగుతుంది. నిజమే ఇది అదృష్టమే !!! ఈ మధ్య కొన్ని కావాలని చేసుకొనే వివాదాల వల్లనైతేమీ మరికొన్ని కావాలని చేసే వివాదాలవల్లనైతేనేమీ భారతదేశంలో సినిమా చూడాలంటే ముందుగా సెన్సార్ సర్టిఫికేట్, ఆ ఆ తరువాత మత/కుల సంస్థల సర్టిఫికేట్, తరువాత చిన్నకోర్టు సర్టిఫికేటు, ఆపైన పెద్దకోర్టు సర్టిఫికేట్ .... బొమ్మపడ్డాక గవర్నమెంట్ సర్టిఫికేట్ ( గవర్నమెంట్  అంటే ఏమిటో?? )  తెచ్చుకొని పొరబాటున ఎక్కడైనా సినిమా హాళ్ళు ఖాళీగా వుంటే అప్పుడు కానీ మీకు సినిమా చూసే అదృష్టం కలుగుతుంది. మాకిలాంటి గొప్పగొప్ప సమస్యలేమీ వుండవు కదా :-)


29, జనవరి 2013, మంగళవారం

fellas gang busted....

Is this a 3rd time? I guess so.

Not too late, but this time with mixed feelings. 

ఏ వేదంబు పఠించె లూత? భుజగంబే శాస్త్రముల్ చూచె? తా
నే విద్యాభ్యసనం బొనర్చె కరి? చెంచే మంత్రమూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు, మీపాద సం
సేవాసక్తియె గాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా !!


Reference : NTV  Telugu news.

23, జనవరి 2013, బుధవారం

బ్రతుకు రహదారి ( 8 lane high way )



౧) బయట భోరున వర్షం.ఉరుములు మెరుపులతో సాయంత్రం నాలుగు గంటల సమయమైనా చీకట్లు అలుముకున్నాయి.

౨) వీధి చివర పురాతనమైన శైవాలయం. వీధి మలుపులో నుండి ఓ ఏభైఏళ్ళ పెద్దాయన పంచెకట్టుతో తడుచుకుంటూ తన పదేళ్ళ మనుమడిని తీసుకొని శివాలయం వైపు నడుస్తుంటాడు.

౩) "తాతా పరిగెత్తు"

౪) మనుమడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నున్న పెద్ద జమ్మి చెట్టు క్రింద నిలబడతాడు.

౫) వేగంగా నడుస్తూ తాతకూడా జమ్మిచెట్టు క్రిందకు చేరి  "ఇక్కడేదో గుడి వున్నట్లుంది లోపలికి పోదాంరా" అంటూ ఇద్దరూ కలిసి ఆలయ ద్వారం గుండా లోపలికి అడుగు పెడతారు.

౬) కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు.  శివాలయ ప్రాంగణంలో అప్పుడే గాలికి రాలిన ఆకులు, చెట్ల కొమ్మలు. గర్భగుడికి ఈశాన్య మూలగా చిన్న మండపం. వాళ్ళిద్దరూ అలా ఆ పరిశరాలను గమనిస్తుండగానే ఇందాకటి మెరుపు తాలూకూ ఉరుము వినిపిస్తుంది. పిల్లఆడు భయపడి తాత నడుము తన రెండు చేతులతో బంధించి గట్టిగా పట్టుకుంటాడు. మరో మెరుపుతో పరిశరాలను తాత ఆకళింపు చేసుకుంటాడు

౭) పిల్లవాడు కాసేపటికి తాత చిటికెన వేలు పట్టుకొని భయంభయంగా నడుస్తుంటాడు. ఉన్నట్లుండి మెరిసిన మెరుపుకు గర్భగుడిలో నున్న శివలింగం మూడవకన్ను తెరుచుకున్నట్లు కనిపిస్తుంది.

౮) ఆ చీకటిలోనే గంట మ్రోగిన శబ్దం. కాసేపు నిశ్శబ్దం. ఆ తరువాత చెట్ల ఆకులపై మనుషుల అడుగుల శబ్దం. ఎక్కడనుండో ఓ పక్షి అరుపు. వెనువెంటనే ఓ ఉరుము.

౯) తడిసిన బట్టల నీళ్ళు పిండి మండపంలో నేలపై ఆరవేసుకుంటారు. ఈదురుగాలుల దెబ్బకు వానజల్లు మండపంలో అన్ని వైపుల నుంచి ఈడ్చికొడుతుంది.


౧౦) వెంట తెచ్చుకున్న గోనె సంచిని తడువకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాడు.

౧౧) కాసేపటికి వర్షం తగ్గుముఖం పడుతుంది. గాలులు తగ్గుతాయి.

౧౨) ఓ మూలన దుప్పటి కప్పుకొని తాత ఒడిలో పడుకొని వున్న మనుమడు ఎటో చూస్తూ మధ్య మధ్యలో తాత కళ్ళలోకి అప్పుడప్పుడూ సూటిగా చూస్తూ వుంటాడు. రెండు గంటల సమయం గడిచి పోతుంది. నిద్రపోతున్న మనుమడిని ఓ ప్రక్కగా పండబెట్టి గోనెసంచిలో నుంచి మరొక్క దుప్పటి తీసి క్రింద పరచి మనుమడిని దానిపై సర్ది తానూ మనుమడికి ఓ ప్రక్కగా పడుకొని ఆకాశం వైపు చూస్తూ వుంటాడు.

౧౩) ఆకాశం నిర్మలమై కార్తీక పౌర్ణమి వెలుగులను ప్రసరిస్తుంటుంది. ఈ వెలుగుల్లో ఆలయప్రాంగణం నిర్మలమై శోభాయమానంగా కనిపిస్తుంటుంది.

౧౪) ఒక చిరుమబ్బు చంద్రబింబాన్ని ఒక లిప్తమాత్రం కప్పి వేస్తుంది. ఆలయప్రాంగణంలో చీకటి వెలుగులు స్పష్టంగా తెలుస్తుంటాయి. ఆ సుందర దృశ్యానికి పులకించిపోయిన తాత ( మనసులో... ఎంతటి విచిత్రము. క్రొద్ది సేపటిక్రితమున్న భయమిప్పుడు లేదు. ఈ క్షణమున్న ఈ ఆనందం ఎప్పటివరకో ....!!! అనుకుంటూ )

పగలెల్ల వరిచేల ఁబనిపాటు  చేసి, ప్రొద్దు కుంకెడి వేళ ఁబొలమును వీడి
యిలుసేరి నూకల నిగురించి, వేడి సంగటి ఁగుడిచెడి సమయంబు నందు
సన్న చీఁకటి రూప సౌందర్య గరిమ మబ్బు వాఱుచునుండ, మాకుటీరంపు
ద్వారంబు కడ నిల్చి ధరణీ విభుండు ముసిముసినవ్వుల మొగమందగింప
సందె కబళెమె వేడె ....... ( ఈ పద్యం నైవేద్యం గ్రంధం నుంచి )

*******

19, జనవరి 2013, శనివారం

ఇదే నిజమైతే ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డి తను చేయాల్సిన పని చేస్తున్నట్లే....

ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం తన మాటను పెడచెవిన పెట్టినట్లైతే తన హయాంలో రాష్ట్ర విభజన జరిగిందన్న పేరును తెచ్చుకోకుండా తన దారి తను చూసుకోవడం కూడా మంచిదేనేమో !

ఈ వార్త ఆంధ్రభూమి నుంచి తీసుకోవడం జరిగింది.



విభజనతో ఉత్పాతమే!


పార్టీకి కొత్త తలపోట్లు తప్పవంటూ సూచన సమైక్యాంధ్రే కొనసాగించాలంటూ విజ్ఞప్తి
నివేదికను జైపూర్‌లోనే హైకమాండ్‌కు అందించాలని నిర్ణయం
సర్కారుకు ఢోకాలేదని భరోసా ఇచ్చే యత్నం అధిష్ఠానానికి స్పీడ్ పోస్ట్‌లో ‘సీమాంధ్ర’ నివేదిక

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ ఏర్పాటు విషయంలో హైకమాండ్ రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రం విడిపోకుండా చూడాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో తలెత్తే పరిణామాలు, ఎదురయ్యే సమస్యలతో ముఖ్యమంత్రి ఒక సుదీర్ఘ నివేదికను స్వయంగా రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘విభజన జరిగితే ఉత్పన్నమయ్యే సమస్యలు’ అన్న పేరిట నివేదికను ముఖ్యమంత్రి రూపొందించినట్టు సమాచారం. జైపూర్‌లో మూడురోజుల పాటు జరిగే చింతన్ శిబిర్‌లో పాల్గొనేందుకు గురువారం రాత్రి బయలుదేరిన ముఖ్యమంత్రి తనవెంట నివేదికనూ తీసుకువెళ్ళినట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఇంతకుముందే ముఖ్యమంత్రి ఒక నోట్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేసినట్టు తెలిసింది. దానే్న మరింత వివరంగా మరో నివేదికగా రూపొందించి వెంట తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది.
జైపూర్‌లో జరుగుతున్న చింతక్ శిబిర్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా ఇతర పెద్దలంతా అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోర్ కమిటీ సభ్యుల్ని వీలునుబట్టి కలుసి రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని వివరించి నివేదిక ప్రతిని అందజేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం, రాయల తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ వంటి ప్రతిపాదనలన్నిటినీ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయని, ఇప్పుడున్న దానికన్నా సమస్య మరింత జటిలమవుతుందని తన నివేదికలో ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షంలో సీమాంధ్ర ప్రాంతంలో జల వనరులు, విద్యుత్, పరిశ్రమలతోపాటు ఉద్యోగాల విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా రాజధాని ఏర్పాటు అన్నది పరిష్కారం లభించని సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే పక్షంలో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతం వారు, ఉత్తరాంధ్ర ప్రాంతం వారు డిమాండ్ చేస్తున్నారని, ఈ పరిస్థితిలో విభజన జరిగిన పక్షంలో ఆ రెండు ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం కావచ్చునని అభిప్రాయపడుతున్నారు. విభజన అంటూ జరిగితే కొత్త రాష్ట్రాల డిమాండ్ కేవలం సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకే పరిమితం కాదని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి డిమాండ్లు పుట్టుకొస్తాయని, కాంగ్రెస్ నాయకత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందని ఆయన భావిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత్వం పాలవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకుండా తాను చూసుకోగలనని అధిష్ఠానానికి ఇవ్వాలనుకుంటున్న నివేదికలో ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోయినట్లయితే ముగ్గురు నలుగురు ఎంపీలు, ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెరాసలోకి వెళ్లే అవకాశం ఉందని, ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి తాను సమీకరించగలనని హైకమాండ్‌కు ముఖ్యమంత్రి హామీ ఇవ్వనున్నట్టు తెలిసింది.
జైపూర్ సదస్సులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీని విడిగా కలుసుకునేందుకు అవకాశం లభిస్తే రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని వివరించడంతోపాటు నివేదికలను అందజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం నగరానికి వచ్చిన రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విడిగా కలిసి రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాలను వివరించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన విషయంలో సోనియా, రాహుల్, ప్రణబ్‌లదే కీలక పాత్ర కానుంది.
స్పీడ్ పోస్ట్‌లో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నివేదిక
ఇలాఉండగా, గురువారం ఇక్కడ సమావేశమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రాన్ని విభజించరాదని, సమైక్యాంధ్రనే కొనసాగించాలని, దీనికి మరో ప్రత్యామ్నాయం ఏదీలేదని తీర్మానించిన విషయం తెలిసిందే. సమావేశంలో చేసిన తీర్మానంతోపాటు ఒక నివేదికను కూడా హైకమాండ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఒక నివేదికను రూపొందించారు. నివేదికలో పలు చారిత్రిక అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ నివేదికే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయంగా అధిష్ఠానవర్గానికి పంపించాలని నిర్ణయించారు. ఈ నివేదికను సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి ఎస్ శైలజానాథ్‌కు గాదె అందించారు. ఈ నివేదిక ప్రతిని స్పీడ్ పోస్ట్‌లో అధిష్ఠానవర్గానికి శైలజానాథ్ పంపించారు. ఈనెల 21న ఢిల్లీకి వెళ్తున్న సమయంలో నివేదిక ప్రతులను వెంటబెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, కోర్ కమిటీ సభ్యులకు నేరుగా అందజేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది.

18, జనవరి 2013, శుక్రవారం

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు తెలంగాణా రేపే ...........





ఏదో పేపెరోళ్ళ కోసమని మూడు నాలుగు  ప్లాన్లు చెప్పారు కానీ అసలు ప్లాన్లు ఈ క్రిందవని  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విశ్వసనీయవర్గాలా? ఎవరయ్యా వాళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడూ... పేపర్లలో మనకు నచ్చింది రాయాల్సివచ్చినప్పుడు ఇలా "విశ్వసనీయవర్గాలను" ఫ్రీగా వచ్చిన ఫినాయిల్ లాగా మిస్టర్ అండ్ మిసెస్ జెఫ్స్ వాడేసుకుంటుంటారు కదా...అలాగే ఇదన్నమాట

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ఈ క్రింది ప్లాన్లను పరిశీలిస్తున్నారని తెలిసింది

౧) తెలంగాణా ను విడకొడితే  రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు వచ్చే M.P సీట్ల సంఖ్య ఎంత వుండవచ్చని కాంగ్రెస్ మేధో మథనంలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరచగా ఓ వార్తా స్రంవంతి విలేఖరి మాత్రం "తెలంగాణా ను విడకొడితే" అన్నదాన్ని పట్టుకొని తెలంగాణాను మళ్లీ రెండు ముక్కలు చేస్తారా? అంటూ వేడీ వేడిగా పులిహోర కలిపి వడ్డించడానికి కెమెరామేన్ రాంబాబు వద్ద ట్రైల్స్ వేస్తున్నాడట

౨) ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా ను విడగొడితే YSRCP ప్రాబల్యం రాయలసీమ, కోస్తా, తెలంగాణాలో  ఎలా వుండబోతుందన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు మా గోచాపి ( గోడచాటు పిల్లి ) విలేఖరి తెలియచేస్తున్నారు. చీకట్లో మా విలేఖరికి ఎవరిగొంతెవరిదో కనిపెట్టలేకపోయారు కానీ లేకుంటే పేర్లతో సహా చెప్పే మొదటి పత్రిక మాదే అయి వుండేది. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి మా విలేఖరి చెవులు రిక్కించి మరీ విని పై సమాచారాన్ని సేకరించారు.

౩) హైదరాబాదు ను కేంద్రపాలిత ప్రాంతంగా వుంచాలా లేక తెలంగాణాలో చేర్చాలా అన్న అంశం పై చెప్పులు  విసురుకోవడం వల్ల మా కెమెరామేన్ కు ఓ కన్ను దెబ్బతిన్నది. ఐనా సరే కెమెరా కంటితో చూసి మాకు ఎప్పటికప్పుడు వార్తలను చేరవేశారు. ఐతే ఈ అంశంపై అధిష్టానం మాత్రం కేంద్రపాలిత ప్రాంతానికే మొగ్గు చూపింది. అధిష్టానం చెవు కొరికే మా మెంబరు ఒకరు చెప్పిన దాని ప్రకారం, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల జగన్ ను మరికొంతకాలం చెంచల్ గూడాలోనే వుంచేదానికి మార్గం సుగమం చేసుకోవచ్చని తీవ్ర ఆలోచనల్లో  అధిష్టానం "తానా" అంటే  ప్రక్కనున్న మంత్రుల "తందానా" అనడం మర్చిపోయి "ఆటా" అన్నారని సమాచారం.

౪) ఒకవేళ హైదరాబాదును తెలంగాణాలో చేర్చినా తెలంగాణా వాళ్ళెలాగూ మా రాజ్యాంగం మేము రాసుకుంటామని ఎలాగూ లొల్లి సేస్తరు కాబట్టి జగన్ కేసు మళ్ళీ మొదటికొస్తది అని న్యాయసూత్రాలను వల్లెవేశారాని అంచేతా మాకే హైదరాబాదు కావాలని ప్రశాంతంగా తిట్టుకోవడం మొదలెట్టారని అబిజ్ఞవర్గాల భోగట్టా

౫) పై ప్లాన్లన్నింటిని పరిశీలించిన అధిష్టానం చివరిగా వందిమాగధులను ఓ ప్రశ్న వేశారంట. 2014 లో భారత ప్రధాని ఎవరు కాబోతున్నారంటూ? ముక్తకంఠంగా అందరూ ఒకటే సమాధానం చెప్పడంతో ముసిముసినవ్వులతో సభ ముగించి జై కాంగ్రెస్ అనమనగా సీమాంధ్ర వాళ్ళతో కలిసి తెలంగాణా నుంచి వెళ్ళిన ప్రజానాయకులు కూడా పొరపాటున జై వైయస్సార్ అన్నారని సమాచారం.


చదువుతూనే వుండండి నిరంతర వార్తా స్రవంతి.

P.S : I am neither supporting nor opposing the process of creating new states.