16, మే 2014, శుక్రవారం

Exit polls ( ఎక్జిట్ పోల్స్ )

మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుండటంతో మనలో వున్న ఉత్కంఠతకు కూడా తెరపడనుంది.ఈ లోపు మీ ఎక్జిట్ పోల్స్ ఫలితాలను కామెంట్ల రూపంలో వ్రాసుకోండి :-)

7, మే 2014, బుధవారం

ఇక అన్ని పత్రికలూ ఒక్కసారిగా అమాయకంగా మారిపోతాయి చూడండి.

ఎలక్షన్లు అయిపోయాయి. ఇక రాజకీయనాయకులకూ ఇన్ని రోజుల శ్రమనుంచి కాస్త విరామం. ఎండనకా వాననకా రేయింబవళ్ళు ప్రచారం చేసిన అభ్యర్థులకు విరామంతోపాటు టెన్షన్లు కూడా. ఈ ఎలక్షన్ల సందర్భంగా పట్టుపడ్డ కోట్ల రూపాయల ధనాన్ని ఎవరికి అప్పగిస్తారో ఏమిచేస్తారో? అలాగే వేల లీటర్లమధ్యము వుండనే వుంది. నిన్నటిదాకా రెచ్చిపోయిన ఈనాడు పత్రిక కూడా ఒక్కసారిగా అమాయకంగా తనకేమీ తెలియదన్నట్లు మారిపోతుంది.ప్రజలు మాత్రం తాము చెయ్యవలసిందంతా చేసేసి ఎలక్షన్ల రిజల్ట్స్ కోసం ఎదురుచూడడం మొదలు పెడతారు.సర్వే సంస్థలన్నీ తమ సర్వేలు ఎంతవరకూ నిజమో తెలుసుకోవడానికి ఎదురుచూపులు చూస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రవేత్తలు మాత్రం పంచాంగాన్ని ముందుపెట్టుకొని నేను ముందే చెప్పానుగా అనటానికి సిద్ధపడుతుంటారు.ఒకవేళ తము చెప్పింది జరగకపోతే ఏ రాహువో కేతువో ఎలాగూ వుండనే వుంటాడు. ఎలక్షన్ కమిషనర్స్ పుణ్యమా అని ఎక్జిట్ పోల్సపై నిషేదాన్ని విధించారు కాబట్టి ప్రతి ఓటరూ ఎవరికి తోచిన సర్వే వాళ్ళు చెప్పుకుంటుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం థూ దీనెమ్మ బ్రతుకు ఏమి ఎండలబ్బా అని తిట్టుకుంటూ ఏ.సీ. రూములకు పరిమితమై పదహారవ తేదీకోసం నిరీక్షిస్తుంటారు. రైతులు ఇప్పటికే పంటకోతకోసి అమ్మేయడం కూడా జరిగిపోయుంటుంది కాబట్టి ఇంటి పట్టునో లేదా రచ్చబండ దగ్గరో కూర్చోని మీసాలు మెలేస్తూ బెట్టింగ్ లకు సిద్ధమైపోయుంటారు.అమ్మలక్కలు పిట్టగోడ దగ్గర చేరి ప్రపంచాన్నంతా ఔపోసన పడుతుంటారు. బ్లాగర్లు ఎప్పటిలాగే బ్లాగులు రాసుకుంటూ కామెంట్లకోసం ఎదురు చూస్తూ వుంటారు. నేను మాత్రం ఈ పోస్టు రాసి ప్రక్కనోడి టపా చదవటానికి పోతా.

అన్నీ చెప్పావు నీ విశ్లేషణేమిటి అనుకునే వాళ్ళకు: నేనూ అందరిలాగే ఓటు వేయకుండా విశ్లేషణలు వ్రాసుకొనే జీవుల ఖాతాలో వుంటాను. నాకు అనిపిస్తున్నదేమిటంటే ఈ ఎన్నికలు ఇరుపార్టీలకూ జీవన్మరణ సమస్య ఐనా ఏదో ఒకపార్టీ గెలవక తప్పని పరిస్థితి. పోటీ హోరాహోరీ జరిగినట్లే అనిపిస్తున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడంకెల నంబరు ను చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు.

5, మే 2014, సోమవారం

ఐసరబజ్జా... సాక్షి vs ఈనాడు

ఇలా కొట్టుకుంటుంటే జనాలకు అసలైన విషయాలు తెలుస్తాయి :-).

 

ఈనాడు పై సాక్షి కథనం


 
జగన్ పై ఈనాడు కథనం
 
 

3, మే 2014, శనివారం

ఇంతకీ మీ ఓటు ఎవరికి?

2014 మే 7 వ తేదీ దగ్గరపడుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం ఎప్పటికన్నా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనిపిస్తుంది. దానికి తోడు మనకు తెలుగులో వున్న న్యూస్ పేపర్లు అన్నీ సిగ్గూ,ఎగ్గూలను వదిలేసి పూర్తిగా పార్టీ లతో సంధానమైపోయినట్టు ప్రచారాస్త్రాలను ప్రజలమీదకు ప్రయోగిస్తున్నారు. ఈ మధ్య నేను తరుచూ ఈనాడూ, సాక్షీ పేపర్లను అనుసరిస్తున్నాను. సాక్షి వైయస్సార్ సీపీ కి ప్రచారాన్ని చేసుకుంటుంటే ఈనాడు మాత్రము రెచ్చిపోయి వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా ప్రచారపాఠాలను గుప్పిస్తుంది. వీటివల్ల ప్రజలలో ఏమాత్రం మార్పు వస్తుందనేది ప్రక్కన పెడితే ఈ రెండు పేపర్లవల్ల తెలుగుదేశం, వైయస్సార్ సీపీలలో లొసుగులు మాత్రం బాగా బయటకు కనిపించేటట్టు చేయడంలో ఈ పత్రికలు సఫలమయ్యాయని చెప్పవచ్చు. ఈనాడైతే మరీ ఒక నెలరోజులనుంచీ వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తుంది. చిత్రమేమిటంటే ఈ పత్రిక తెలుగుదేశానికి అనుకూలంగా కథనాలను ప్రచురించడానికి బదులు ysrcp కి వ్యతిరేకంగా negetive ప్రచారానికి తెరలేపింది. అంటే టి.డి.పి తరపున ప్రచారం చెయ్యడానికి ఏమీ విషయంలేక ysrcp మీద పడిందో లేక పోటీ రెండు పార్టీలమధ్యనే కాబట్టి ఒకదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి టి.డి.పి కి ఓట్లు మళ్ళించడంలో అంతర్భాగంగా వేసిన ఎత్తుగడో తెలియదు కానీ ఈనాడు పేపరు ప్రధాన వార్తలన్నీ ysrcp కి వ్యతిరేకంగా ప్రచురిస్తున్నారు.

ఇక ఓటర్ల విషయానికొస్తే వాళ్ళమనసుల్లో ఓటు ఎవరికి వెయ్యాలో ఇప్పటికే నిర్ణయమైపోయినట్టు కనిపిస్తుంది.నేను తిరిగిన ప్రదేశాలలో ఐతే మాత్రం జనాలు ఈసారికి ysrcp వైపే మొగ్గు చూపిస్తున్నారు. నాకెలాగూ ఓటువేసే సౌకర్యం లేదు కాబట్టి ఇలాంటి పేపర్లు చదువుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. వార్తాపత్రికలల్లో వచ్చే వార్తలను సేకరించి ఇక్కడ వ్రాద్దామని ఒక సంకల్పం చేసుకున్నా కానీ పేపరు నిండా ఇవే వార్తలను చూసి వాటిని మళ్ళీ ఎత్తివ్రాయలేక ఆ సంకల్పాన్ని విరమించుకున్నాను. ఇంతకీ మీ ఓటు ఎవరికి?