30, నవంబర్ 2017, గురువారం

జగన్ ఇరవై ఒకటవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీ నుంచి కొంత భాగము ... ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర బి.అగ్రహారం దాటాక 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ వేప, కానుగ మొక్కలు నాటాను. ఈ ప్రయాణంలో నాకు శ్రమ గానీ, దూరం గానీ తెలియడం లేదు. ప్రజల్లో ఉండి, వారితో నేరుగా మాట్లాడుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం ఒక అపూర్వమైన అనుభవం. నాన్నగారు ప్రజల నుంచి ఏ డిమాండూ లేకుండానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానికి ప్రధాన కారణం 2003 పాదయాత్ర సమయంలో ప్రజల కష్టనష్టాలను ఆయన పూర్తిగా అర్థం చేసుకోవడమే. వారికున్న సమస్యలు తీరాలంటే ఏం చెయ్యాలో కూడా ఆయనకి బాగా అర్థమైంది. బహుశా ప్రజాజీవితంలో ఉండే ప్రతి నాయకుడు చెయ్యాల్సిన పని ఇది. ఈ ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయం ఉండదు."

ఆ.వె|| పాద యాత్ర చేయ ఫలమేమి యన్న ప్ర
జలగచాట్లు చూసి సరిగ పథక
ములను దిద్ద వచ్చు మూల సమస్యల
పార ద్రోల వచ్చు నాంధ్ర స్థలిన

29, నవంబర్ 2017, బుధవారం

జగన్ ఇరవైరోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా పాదయాత్ర డైరీ లో కొంత భాగము ఆపై నా పద్యము

"జనం బాధలు తీర్చిన వాడు భగవంతునితో సమానం. ఈ రోజు అనంతపురానికి చెందిన రమేష్, పద్మ అనే బ్రాహ్మణ దంపతులు కలిశారు. వాళ్లు కేవలం నాన్నగారి వల్లే ఈ రోజు సంతోషంగా ఉన్నామని చెప్పారు. రమేష్‌గారు అనంతపురం డెయిరీలో పనిచేసి, 2014లో పదవీవిరమణ చేశారు. అనంతపురం డెయిరీని మూసివేయాలని చంద్రబాబునాయుడుగారు ప్రయత్నిం చారని, కానీ అదృష్టవశాత్తు నాన్నగారు 2004లో గెలవడం వల్లనే తమ డెయిరీ మూతపడకుండా ఆగిం దని, దాంతో పిల్లలను చదివించుకుని, వారికి పెళ్లిళ్లు చేసి, పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించ గలుగుతున్నామని.. ఇదంతా నాన్నగారి చలవేనని వాళ్లు చెప్పడంతో నా హృదయం సంతోషంతో బరువెక్కింది. కోట్లాది మంది హృదయాల్లో కొలువై ఉండటం కన్నా అదృష్టం ఏముంటుంది? అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టమే ప్రజల పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. గతంలో చేసినట్లుగానే చంద్రబాబునాయుడుగారు అనంతపు రం డెయిరీతో సహా రాష్ట్రంలోని పలు సహకార డెయిరీలను మూసివేయించడానికి ప్రయత్నిస్తున్నా రు. దీంతో వేలాది మంది డెయిరీ ఉద్యోగులు, వారి కుటుంబాలు, ఈ డెయిరీలపై ఆధార పడి ఉన్న లక్షలాది మంది పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ రోజు పాదయాత్ర సాగిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. నాన్నగారు ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి ఉన్న మూడున్నర కోట్ల రూపాయల రుణాన్ని రద్దుచేశారు. ఆయన హయాంలో ఎమ్మిగనూరులో అపెరల్‌ పార్క్, చేనేత క్లస్టర్ల కోసం 97 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఆయనే గనుక ఉండిఉంటే ఈ పాటికి అవి పూర్తయి ఉండేవి. దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెంది.. దాదాపు 6,000 మందికి ఉపాధి దొరికేది.. నేతన్నల జీవితాలు బాగుపడేవి. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నేతన్నల మీద వరాల వర్షం కురిపించారు. జిల్లాకో చేనేత క్లస్టరు, లక్ష రూపాయల వడ్డీ లేని రుణం, సబ్సిడీపై ముడిసరుకు పంపిణీ, ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి లక్షన్నర రూపాయలతో వర్క్‌ షెడ్డుతో కూడిన పక్కా ఇల్లు.. ఇలా ఆయన అరచేతిలో స్వర్గం చూపించారు. తీరా గెలిచాక వీళ్లెవరో కూడా ఆయనకు గుర్తులేరు. ఎమ్మిగనూరు చేనేత సొసైటీకి గతంలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలుండేవి. అవన్నీ ఇప్పుడు మూతపడ్డాయి. ఆ బ్రాంచీలను తెరిపించే ప్రయత్నం చేస్తాను.


ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు.. రెంటికీ కటకటే. తుంగభద్ర లోలెవల్‌ కెనాల్‌ నుంచి నీటి లభ్యత తక్కువ అవుతున్న తరుణంలో రాజశేఖరరెడ్డిగారు దార్శనికతతో ఎల్‌ఎల్‌సీ ఆయకట్టును స్థిరీకరించడంలో భాగంగా పులికనుమ ప్రాజెక్టు చేపట్టారు. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పదిశాతం పనులు పూర్తి చెయ్యడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ పనులుæ పూర్తయితే ఇక్కడ 26 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాన్నగారు ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ఇలాంటి ప్రాజెక్టులన్ని ంటినీ మన ప్రజాప్రభుత్వం వచ్చాక యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందిస్తాము. "



సీ|| సహకార డైరీల సాకి యుద్యోగుల కడగండ్లు కడగంట కడిగి వేసి
చేనేత నేతన్న చితికిపోకుండగన్  చేయూత నిచ్చె నా శివుడు మెచ్చ
నీటి కటకట కన్నీటి రైతులగని కట్టె సుజలముల కాన కట్ట
వరములిచ్చి ప్రజల బాధలు తీర్చ నవతరించె నాంధ్ర యవనిక పైన

ఆ.వె|| అట్టి రాజ శేఖ రాధిపు తండ్రియై
చనుట నాదు పూర్వ జన్మ ఫలము
కాదె? వాడ వాడ గనుచుంటి నపరిమి
తాదరణను, జన్మ ధన్య మయ్యె

28, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పందొమ్మిదవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యం

ఈ రోజు పాదయాత్ర డైరీ లోని కొంత భాగం... ఆపైన నా పద్యం

"ఈ రోజు పాదయాత్రలో దారి పొడవునా ఎక్కడ చూసినా పత్తి చేలే. రైతుల ముఖాల్లో మాత్రం సంతోషం కనిపించలేదు. ఆ పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడాను. వీరిలో చాలా మంది కౌలు రైతులు. రాజు అనే రైతు ఐదెకరాలు కౌలుకి తీసుకొని పత్తి వేశాడు. ఎకరాకు దాదాపు రూ.35,000 పెట్టుబడి పెట్టాడు. గులాబీరంగు పురుగు ఆశించడంతో పంట మొత్తం నాశనమైంది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. వచ్చిన ఆ కొద్ది పత్తిని మార్కెట్‌కి తీసుకెళ్తే, రూ.1,500 నుంచి రూ.2,000 రూపాయలకు మించి ధర పలకడం లేదు. ఈ ప్రాంతంలో పత్తి రైతులందరిదీ ఇదే వ్యథ. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి ఏ స్పందనా లేదు.

ఈ ఏడాది సబ్సిడీ మీద ఇవ్వాల్సిన లింగాకర్షక బుట్టలను కూడా ఇవ్వలేదు. కోడుమూరులో జరిగిన రైతు సమావేశంలోనూ ఇటువంటి సమస్యలే నా దృష్టికి వచ్చాయి. కేవలం పత్తే కాదు, మిగతా అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. రైతులను రుణమాఫీ చేశారా అని అడిగాను. రుణమాఫీ కాలేదు, నోటీసులు వస్తున్నాయి, చేసిన కాస్త మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. బ్యాంకుల గడప కూడా ఎక్కలేకపోతున్నామని వాళ్లు బాధ పడ్డారు. గిట్టుబాటు ధరల విషయమై రైతుల ఆవేదన అంతా, ఇంతా కాదు. నాన్న ఉన్నప్పుడు గరిష్ట ధరలు పొందిన రైతులు ఈ రోజు గిట్టుబాటు ధరల కోసం కూడా అల్లాడుతున్నారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే రైతుల ప్రయోజనాలను దళారులకు తాకట్టు పెట్టి, రైతుల దగ్గరి నుంచి తక్కువ ధర లకు కొని, తన హెరిటేజ్‌ దుకాణాల్లో అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. వ్యవసా యం సంక్షోభంలో ఉంటేనే ఆయన కు లాభం. అందుకే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. ఈ పాలకుల నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాలు రైతుకి వ్యవసాయాన్ని భారం చేశాయి. వ్యవసాయం దండగని భావించే పాలకులు ఉన్నంత కాలం రైతుల పరిస్థితి ఇంతే.

నాకొక స్వప్నం ఉంది. వ్యవసాయ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండటం, నిరంతర విద్యుత్, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమిసంహారక మందులు, సాగునీటి సౌకర్యం, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు తగిన సూచనలు, సలహాలు, పంటకు గిట్టుబాటు ధర, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పంట నష్ట పరిహారం అందించడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేయాలి. ఒక్క ఆత్మహత్య కూడా జరగకూడదు. రైతు ముఖంలో ఆనందం, వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని రైతులు భావించాలి. రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో ఈ స్వప్నం తప్పక సాకారమౌతుంది."


సీ|| దారి పొడవున ముదముజేయు పత్తిచేలాదరముగ స్వాగ తమ్ము పల్కె
కాని, పోషకుడైన కామందు మోమున గననైతి చిర్నవ్వొ క్కటియు గూడ
పంట పండించ ముప్పదియైదు వేలు విక్రయముచేయ కనరు కాసు నైన
ఎటులజీవింతు రిచటిరైతులు ప్రభుత్వ కరుణాకటాక్షంబు గనక నిచట

ఆ|| ఆదుకొందు నేను ప్రభుతనే ర్పడజేసి
మేలగు సలహాల మెప్పు తోడ
ఎన్ను కొనుడు నన్ను మీఓటు వేసి యె
లమిగ మిమ్ము ధాన్య లక్ష్మి కూడు

27, నవంబర్ 2017, సోమవారం

జగన్ పద్దెనిమిదవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు జగన్ పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగము..ఆపై నా పద్యము

"ఈ రోజు గోరంట్లలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించాం. బలహీన వర్గాలు అన్న పదం వింటేనే నాకు బాధగా ఉంటుంది. అందరూ సమానంగా ఉండాల్సిన సమాజంలో ఈ అంతరాలెందుకు? బలహీన వర్గాలంటే తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాలే గానీ మేధస్సులో, శ్రమలో ఎవరికీ తీసిపోయేవాళ్లు కారు. అయితే తప్పుడు హామీలతో, తాత్కాలిక ప్రలోభాలతో నేతలు వీరిని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నందు వల్లే ఈ ప్రజలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలుగానే ఉన్నారు."

గుణము నందరయగ కోరికష్టము చేయు
టందు సాటిగాదె యగ్రజులకు
తరతరముల తగని తమయధి కారమె
శాప మయ్యె మాకు జలజ నేత్ర

చిన్న వివరణ: ఇక్కడ మూడవపాదంలో "తరతరముల తగని తమయధి కారమె" అన్నప్పుడు "తమ" అంటే అగ్రకులజుల అని అర్థం. జగన్ కూడా అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా... కాబట్టి వాళ్ళ బాధనుఅలా వ్యక్తపరిచారు.

ఇది ఒక వెనుకబడిన తరగతి వాని ఆవేదన గా వ్రాయడమైనది.

26, నవంబర్ 2017, ఆదివారం

జగన్ పదిహేడవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా జగన్ డైరీ లో నుంచి కొంతభాగము

పత్తికొండ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీయే అధికారంలో ఉంది. కానీ, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దారిద్య్రం తాండవిస్తోంది. రోడ్డు, రవాణా, ప్రజారోగ్యం, గృహ కల్పన, తాగునీటి సౌకర్యం.. అన్నీ దీనావస్థలో ఉన్నాయి. ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ స్థితికి మోక్షం ఎప్పుడో?

చెరుకులపాడు గ్రామంలోకి  ప్రవేశించగానే కొద్ది నెలల క్రితం జరిగిన దారుణ మారణకాండ గుర్తుకు వచ్చి మనసు కలత చెందింది. అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రశ్నించాడని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డంకిగా మారతాడోనని భయపడి నారాయణరెడ్డిగారిని దారుణంగా హత్య చేయించారు. ఇది ఏ సంస్కృతికి నిదర్శనం? మనం ఎటువైపు పయనిస్తున్నాం? ఈ రాక్షస పాలన అంతం కావాలి. ఈ ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలి. అధికార పార్టీ ఎంతటి దౌర్జన్యాలకు, అణచివేతకు పాల్పడుతున్నా, మన వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు మనోధైర్యాన్నివ్వాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నా.. నమ్ముకున్న జనం కోసం, పార్టీ కోసం పోరాడుతున్న శ్రీదేవమ్మ గారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అందుకే రాష్ట్రంలోనే మొట్టమొదటగా శ్రీదేవమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాను. 


ఈ రోజు నాగరాజు అనే ఆర్టీసీ డ్రైవర్‌ కలిశాడు. 1974లో ఆర్టీసీలో చేరిన ఆయన 35 సంవత్సరాలు సంస్థకే జీవితాన్ని అంకితం చేసి, ఆరోగ్యాన్ని సైతం కోల్పోయి, 2008లో పదవీ విరమణ చేశాడు. ఆయన అందుకున్న చివరి జీతం 18,000 రూపాయలు. ఇప్పుడు వస్తున్న పింఛన్‌ 1,650 రూపాయలు! గుండె బరువెక్కింది. అంత చిన్న మొత్తంతో వృద్ధాప్యంలో బతుకు బండిని ఎలా లాగగలడు? జీవితానికి కనీస భద్రత కూడా ఉండనవసరం లేదా? పదవీ విరమణ తర్వాత ఏ ఉద్యోగికైనా అభద్రత లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన భరోసా కల్పించాలి. 

స్కూల్లో మధ్యాహ్న భోజనం వండే మహిళలు కలిశారు. గత ఆరు నెలలుగా తమకు రావాల్సిన చెల్లింపులు రాలేదని వాపోయారు. అలాగే మోడల్‌ స్కూల్‌ సిబ్బంది కలిశారు. వారికి ఐదు నెలలుగా వేతనాలివ్వడం లేదట. పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి, వారి హాజరును మెరుగుపరిచి, అక్షరాస్యతను పెంపొందించడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధో! 

ప్రభుత్వ హాస్టళ్లను, స్కూళ్లను మూసివేయించడం, ప్రతిష్టాత్మకమైన మోడల్‌ స్కూళ్లలో పని చేసే అధ్యాపకులకు కూడా వేతనాలు ఇవ్వకపోవడం, ఆ స్కూళ్లలో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం.. ఈ చర్యలన్నీ మీ బినామీలైన కార్పొరేట్‌ విద్యా మాఫియాకు లబ్ధి చేకూర్చడం కాదా? మీ పాలనలో, మీ అండదండలతో ఇప్పటి వరకు అనేక రాజకీయ హత్యలు జరగడం వాస్తవం కాదా? హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరీ ప్రోత్సహించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?   


సీ|| ఇంటింట లేచి నర్తించు దరిద్ర దేవతలకావాసమై ఁబఱగు నూళ్ళు
మౌలిక వసతులు మాటవరుసకైన కనమిచటరయగ  కక్ష లూళ్ళు / కఱకు టూళ్ళు
జీతము గ్రాసము జీవించ నీటికి వగచు నిరాధార పల్లె సీమ
బ్రతుకు చిందరబందర మము సేవించు ప్రజానాయకమణులె జలగ లిచట 

గీ|| కలిసె డ్రైవరు, కలిసెను కాంత లంద
రు తమ బాధల, కనుల నీరుబికె వారి
కష్టముల్గని, వీరిపై కరుణ జూపి
నాదు కొనునాధు డెవ్వడీ ధరణి లోన

25, నవంబర్ 2017, శనివారం

రక్త సంబంధ బాంధవ్యాలు....అంత తేలికగా పోయేవి కావు



నవంబరు పద్దెనిమిదిన ఉదయం ఆరుగంటలు. మంచి నిద్రలో వున్నాను.మంచం ప్రక్కనే వున్న ఫోన్ ట్రింగ్ గ్.... ట్రింగ్ గ్ ... అంటూ మోగడం మొదలైంది.ఇంత పొద్దునే ఎవరబ్బా అని చూస్తే ప్రైవేట్ నంబరు అని చూపిస్తుంది. సరే నని ఫోన్ ఎత్తాను. అవతలి నుంచి తెలుగులో అపరిచిత కంఠము. నేను ఫలానా అని పరిచయము చేసుకొని "మీ మేనత్త కొడుకు నిన్నొకసారి ఫోను చెయ్యమన్నాడని" చెప్పాడు. 
"సరే ఈ వారంలో చేస్తాను" అన్నాను. వెంటనే వారమంటే ఆలశ్యమవుతుందేమో అని అసలు విషయం చెప్పాడు. పనిచేసే దగ్గర తననెవరో కొట్టారని కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయని ఇంటెన్సివ్ కేర్ లో వున్నాడని హాస్పిటల్ ఖర్చు రెండున్నర లక్షలవుతుందని చెప్పాడు. ఆ ఫోను చేసినబ్బాయితో కొంచెంసేపు క్షేమ సమాచారాలు మాట్లాడి ఫోను పెట్టేశాను. ఫోను పెట్టేస్తూ మా అత్తకొడుకు ఫోను నంబరు కూడా తీసుకొన్నాను.

మా అత్తకొడుకుకు నాకు వయస్సులో తొమ్మిదినెలల తేడా. అంటే నేను తొమ్మిదినెలల పెద్ద. మా ఊర్లో వున్నప్పుడు మా యింటి వెనకాలే మా మేనత్త వాళ్ళిల్లు. మాకూ వాళ్ళకూ ఏవో తోటలకు  సంబంధించిన చిన్న చిన్న గొడవలుండేవి కాబట్టి వాళ్ళింటికి మేము మా యింటికి వాళ్ళు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు కానీ పిల్లలం పొలానికెళ్ళినప్పుడు, తోటలకెళ్ళినప్పుడు కలిసి ఆడుకొనేవాళ్ళం. నా ఐదవతరగతి దాకా విద్యాభ్యాసం మా చిన్నాయన వాళ్ళ దగ్గర వేరే ఊళ్ళో జరిగింది కాబట్టి మా మేనత్త కొడుక్కి నాకు పెద్ద స్నేహం వుండేది కాదు. అన్నట్టు మా మేనత్తకొడుకు పేరు కూడా రామిరెడ్డే. అయితే ఊర్లో అందరం రామయ్య అని పిలిచేవారు.

మా కుటుంబం వేరు పడటంతో నా ఆరవతరగతినుంచి పదవతరగతి దాకా మా ఊరికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న  వెలిగండ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదవాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలమందరమూ కలిసి స్కూలుకు వెళుతూ సరదాగా ఆడుకుంటూ మధ్యలో వాగులో మునుగుతూ అప్పుడప్పుడూ చదువుకుంటూ పదవతరగతి పూర్తిచేశాము. రామయ్య నాకంటే ఒక తర్గతి చిన్న. నేను ఇంటర్మీడియెట్ లో వుండగా తను పదవతరగతి తప్పడమూ అప్పడికే మా ఊరి జనాలు ఇక్కడపొలాలనమ్మివేసుకొని బ్రతుకు దెరువు కోసం వలసలు పోవడం వుధృతంగా జరుగుతున్న రోజులు. వీళ్ళు కూడా మా ఊరొదిలి గుంటూరు జిల్లా వినుకొండ తాలూకాకు వలస వెళ్ళారు. ఆ ఊరికి వలసవెళ్ళగానే మా కుటుంబాల మధ్య వున్న పొలం తగాదాలు కూడా సమసి పొయ్యాయి.

మేము కూడా నా ఇంజనీరింగ్ మూడవసంవత్సరంలో మా ఊరొదిలి ఆ ఊరికి వలసవెళ్ళాము. రామయ్య చదువు వలసతోటి ఆగిపోయింది. అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఒక అక్కకు ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. రామయ్య పొలం పనులతోపాటు బేల్దారి పని కూడా బాగా నేర్చుకొని ఊర్లో ఇల్లుకట్టే పనులకు వెళ్ళి సంపాదిచేవాడు. నేను సెలవులకు ఇంటికొచ్చినప్పుడు ఇద్దరం కలిసి అలా నాగార్జున సాగర్ కాలువపై నడుచుకుంటూ రవ్వారం, తిమ్మాపురం,నూజెండ్ల మొదలైన ఊర్లు చుట్టి వచ్చేవాళ్ళం. మంచి ఎండాకాలమైతే తిమ్మాపురం పుచ్చకాయ తోటలోకి వెళ్ళి కడుపు పట్టిన కాడికి పుచ్చకాయలు తిని వచ్చేవాళ్ళం.

ఉద్యోగరీత్యా నేను ఊరిలో వుండటం తక్కువ. కాలచక్రం ఎవరికోసం ఆగదుకదా. ఆ పయనంలో మేము ఆ ఊర్లో ఇల్లమ్మేసి హైదరాబాదుకు వెళ్ళిపోవటం రామయ్య ఊర్లో పంట మీద వచ్చేఆదాయం సరిపోక పిల్లల చదువుకోసం గుంటూరులో బేల్దారి పనులు చేసుకుంటూ ఇంటిదగ్గరున్న తనభార్యకు డబ్బులు పంపడం చేస్తుండేవాడు. నేను సంవత్సరమున్నర క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు పరిస్థితి అది. ఆ తరువాత మా మధ్య ఫోను సంభాషణలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ లేవు.

ఇదిగో మళ్ళీ ఈ రోజు ప్రొద్దున నేను రామయ్యకు ఫోను చేసే వరకు. నేను మొదటి సారి ఫోను చేసినప్పుడు ఫోను ఎత్తలేదు. ఒక అరగంటాగి ఫోను చేస్తే రామయ్య కొడుకు ఫోను యెత్తి వాళ్ళనాన్నకిచ్చాడు. ఐ.సి.యు లో వున్నానని ఇక్కడ నాకెవరితో చెప్పుకోవాలో తెలియక రాత్రి నీకు ఫోను చెయ్యమన్నానని చిన్న చిన్న విషయాలకు మీదాకా రాము కానీ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించమని చెబ్తుండగా నర్సో,డాక్టరో మాట్లాడొద్దని చెప్పారేమో ఫోను మళ్ళీ వాళ్ళకొడుక్కి ఇచ్చాడు. కొడుకు బి.బి.యె చేశాడు కానీ ఉద్యోగం లేదనుకుంటా. ఆ అబ్బాయిని నేను నాకు ఫోను చేసిన అబ్బాయి ఫోను నంబరు ఇవ్వమని అడిగితే వాడికేమి అర్థమయిందో కానీ మా అక్క కొడుకు ఫోను నెంబరు ఇచ్చాడు.

విషయం మా అక్కకొడుక్కి కూడా తెలిసి వుంటుందేమో నని వాడికి మెసేజ్ పెట్టాను. మాట్లాడుతుండగా ఫోను కట్ అయింది.ఈ లోగా మరో రోజు గడిచింది. మళ్ళీ రామయ్యకు ఫోను చేస్తే ఈ సారి క్షుణ్ణంగా మాట్లాడడానికి వీలు పడింది. 

ఇప్పుడు తాను కామారెడ్డి దగ్గర పనులు చేస్తున్నట్లు ఆపనుల్లో భాగంగా ఒక అపార్ట్మెంట్ కన్ష్ట్రక్షన్ విషయంలో వీళ్ళకు వేరే గ్రూపు కు మధ్య పోటీ ఏర్పడి వీళ్ళా అపార్ట్మెంట్ కడుతున్నారనే దుగ్ధతో నమ్మించి ఒక్కడిని మాట్లాడదాము రమ్మని ఊరు బయటకు తీసుకెళ్ళి పెద్దబండరాయి తీసుకొని కాళ్ళపై ఎత్తెత్తి వేశారని చెప్పాడు. అలాగే ఇప్పటిదాకా ఆపరేషన్ కోసం లక్ష ఇరవైవేలదాకా వేరే వాళ్ళ దగ్గర సేకరించానని చెప్పాడు.సరే నాకు చేతనైన సహాయం నేను చేస్తానని ఫోను పెట్టేసి మా అక్కకొడుక్కి ఫోను చేశాను. ఇంతకు ముందే వాళ్ళు మా అక్కదగ్గరకెళ్ళి మందులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగారట. కానీ మా బావ అయ్యప్పమాల వేసుకొని కేరళ కు వెళ్ళి వుండటంతో డబ్బులు లేవని  చెప్పారట. 

విషయ తీవ్రత అర్థమై నేను మా అక్కకు ఫోను చేశాను. "అబ్బయ్యా డబ్బులు ఇవ్వొచ్చు కానీ వాళ్ళదగ్గరకెళ్తే ఇంక తిరిగిరావని" చెప్పింది. నేనందుకు అక్కా పాపం బాధల్లో వున్నాడు మన్మిచ్చేడబ్బులు తిరిగొస్తాయని కాదు కానీ సాటి మనిషికి సాయం అనుకొని ఇద్దామని ఒప్పించి మా చేతనైన సహాయం చేశాము. అప్పుడనిపించింది ఎంతైనా రక్త సంబధం రక్తసంబంధమేనని. మా మేనత్తలేదు, మా అమ్మ నాన్న లేరు కాని వాళ్ళ రక్తసంబంధం ఇంకా బ్రతికే వుంది.

ఇప్పుడు రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఐ కోలుకుంటున్నాడు.

24, నవంబర్ 2017, శుక్రవారం

జగన్ పదహారవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ముందుగా జగన్ డైరీలోనుంచి కొంత భాగము

"పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభం అయిన ప్పుడు అశేష జనవాహిని నాతో కలిసి అడుగులు వేసింది. సమస్యల్ని నివేదించింది.   మధ్యాహ్నం పాదయాత్రలో ఉండగా విజయవాడలో రైతులు ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి హతాశుడిని అయ్యాను. నేరుగా వారితో ఫోన్‌లో మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తక్షణం రైతులకు సహాయం అందిస్తుం దని, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపవద్దని వారికి విజ్ఞప్తి చేశాను.

నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు.. ఇలా ప్రతి అవి నీతిలోనూ, ప్రతి అక్రమంలోనూ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండటం, వారికి ముఖ్యనేత అండదండలు పుష్కలంగా ఉండటంతో, రైతులలో ఆత్మ విశ్వాసం మరింత సన్నగిల్లుతోంది. ఆత్మ హత్యల వైపు వారిని ప్రేరేపిస్తోంది. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని మార్చాలి. రైతన్నను మారాజులా చూసు కోవాలి"


కం|| సకల జనావళి క్షుద్బా
ధ కరుణ దీర్చు మనరైతు దారిగనకనే
డు కొలిమిన కాలి నిర్జీ
వ కనులలమటించు చుండె వాని/భరత పొలములన్

23, నవంబర్ 2017, గురువారం

జగన్ పదిహేనవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ఈ రోజు డైరీ లోనుంచి కొంత భాగము

"ఈ రోజు నడిచినదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం. రోడ్డు మార్గం, సమాచార సౌకర్యం, రక్షిత మంచినీరు కూడా సరిగాలేని గ్రామాలు! ఈ ప్రాంతంలో ఆకస్మికంగా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా వాళ్ల పరిస్థితేంటి.. అన్న ఆలోచన రాగానే మనసు బరువెక్కింది.

ముద్దవరం, వెంకటగిరి, పెండేకల్లు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, బతుకు భారంగా గడుపుతున్న దాదాపు 20 మంది నిరుపేదలు వచ్చి కలిశారు. కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలు, వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో వాళ్లు బాధపడుతూ, ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఆదుకునే నాథుడులేక అల్లాడిపోతున్నారు. గుండె తరుక్కుపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పేదవాడు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలడు?

కొలుముల్లపల్లెకి చెందిన ఓబులమ్మ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఉన్న ఆ ఒక్క కొడుకు కండరాలు, నరాలకు సంబంధించిన వ్యాధితో మంచం పట్టాడు. ఇటీవలే వెన్నెముక కూడా విరిగింది. కదలలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకుందామంటే ఆంధ్రప్రదేశ్‌లో సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ లాంటి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. దాంతో వైద్యం చేయించలేక.. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూడలేక.. ఆ కన్నతల్లి తల్లడిల్లుతోంది. వెంకటగిరికి చెందిన కిరణ్‌కుమార్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉన్న ఒకే ఒక కొడుక్కి కిడ్నీల వ్యాధి. మందులకే నెలకు దాదాపు 4,000 వరకూ ఖర్చవుతోంది. కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు పెరిగిపోయి అతను ఆర్థికంగా చితికిపోతున్నాడు. ‘అప్పు పుట్టడం కూడా కష్టమవుతోందన్నా..’ అని అతను ఒక్కసారిగా భోరుమనగానే నా మనసు కదిలిపోయింది. ప్రాణాంతకంగా పరిణమించే డెంగీ, తలసీమియా వంటి వ్యాధులను కూడా ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. దీంతో వేలాది కుటుంబాలు గుండెకోతను అనుభవించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సామాన్యుల క్షోభ అర్థమయ్యేట్లుగా కనిపించడం లేదు.
చంద్రబాబుగారూ.. ఆంధ్రాలో తగిన వైద్య సదుపాయాలు లేవు. అన్ని సదుపాయాలూ ఉన్న హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో మీరు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. పేదవారెవరైనా వైద్య సహాయం అందక మరణిస్తే బాధ్యత మీది కాదా? హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తే మీకొచ్చే నష్టమేంటి? అంటే పేదల ప్రాణాలకు విలువే లేదా?"


సీ|| కొండల గుట్టల కూడి నడచుట కసాధ్యమైనట్టి దేశమిది, చూడ
రక్షణ నొసగు నీరము సమాచార సౌకర్యముల్ లేనట్టి గ్రామములివి
రోగము రొష్టుల రోదించు బడుగుజీవులకు సాక్షమ్ములీ వూళ్ళు, కనగ
నింటికొక రకమైనట్టి రోగముల బ్రతుకునీడ్చభాగ్యవంతులయ వీరు

తే.గీ|| రోగము నయము చేయగ రూకలేవి?
ఉన్న ఆరోగ్య శ్రీ చెల్లదుకద తెలుగు
దేశమున, మాకికను మీరె దిక్కనుచు ప్ర
జలు నడచిరి జగన్ తోడ జతగ నేడు

22, నవంబర్ 2017, బుధవారం

జగన్ పద్నాలుగవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యం.

పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం. ఆ తరువాత నా పద్యం

"ఈ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు లేదు. సాగునీరూ లేదు! అనేక చెరువులున్నా గొంతుకు గుక్క నీరు, చేనుకు చుక్క నీరు లేదంటే ప్రభుత్వ చేయూత ఏమాత్రం ఉందో తెలుస్తోంది. ఇక్కడి నాపరాళ్ల పరిశ్రమ పైన కూడా నారా వారి దయలేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ ప్రాంతం పాలిషింగ్‌ యూనిట్లకు ప్రసిద్ధి.. వేలాది కుటుంబాలు ఈ యూనిట్ల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, నిర్దయాపూరిత చర్యల కారణంగా ఈ పాలిషింగ్‌ యూనిట్లు ఇబ్బందుల్లో పడ్డాయి. చెల్లించాల్సిన రాయల్టీలు, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్నాయి. 

కర్నూలు జిల్లా మొత్తంమీద ఒక్క ఎకరాకు కూడా నీటిపారుదల సౌకర్యంలేని నియోజకవర్గం ఇదొక్కటే. తాగునీటికి కూడా ఇక్కడ కటకటగా ఉంది. జీవనాధారమైన పాలిషింగ్‌ యూనిట్లు, వ్యవసాయం.. రెండూ లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. పుట్టిపెరిగిన చోటే బతికి బట్టకట్టలేకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి! మనిషి జీవించే హక్కునే కాలరాసేలా.. కనీస వసతులు, ఉపాధి కల్పించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఈ పరిస్థితిని మార్చాలి. మైనింగ్‌కు పుష్కలంగా వనరులు ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలను తిరిగి బతికించాలి.. వలసలను ఆపాలి. "


సీ|| గొంతు తడుపుకొన గుక్కెడు నీరు లేదిక పంట పండించ దిక్కు లేదు
నాపరాళ్ళ పరిశ్రమ పతనమయ్యె బాబు దయలేక బ్రతుకు బుగ్గిపాలె
పోవుచుంటిమి చేత పొట్టపట్టుకొని యా పట్టణ వాసపు బానిసలుగ
జన్మస్థలమునందు చచ్చు భాగ్యంబు నోచుకొనమే పాపము చుట్టు కొనియొ

గీ|| మనిషి జీవించు హక్కును మసిని జేసి
పెద్ద పెద్ద మాటలు జెప్పు పద్ధతేల
కూడు గూడు గుడ్డలుకోరి కోరి ఓటు
వేసి మోసపోయితిమిపు డేడ్చి ఫలమె?

సూచన: తేటగీతి చివరి పాదంలో  "వేసి" లో "సి" కి "ఏడ్చిన" లో "చి" కి  ప్రాసయతి చెల్లుతుందనుకుంటాను. అలా కుదరదనుకుంటే ఆ పాదాన్ని యిలా చదువుకోండి


వేసి మోసపోయితిమిరో వెక్కి ఫలమె?

21, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పదమూడవ రోజు పాద యాత్ర - నా పద్యము

పాదయాత్ర డైరీ నుంచి కొంతభాగం

"చంద్రబాబు పాలనపై, రాష్ట్ర ప్రజలే కాదు.. సూర్య భగవానుడు కూడా ఆగ్రహంగా ఉన్నట్లున్నాడు! బనగానపల్లెలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన పాదయాత్ర హుస్సేనాపురం చేరుకునే సమయానికి బాలభానుడు భగభగల భానుడయ్యాడు. పోలీసులు సృష్టించిన అడ్డంకులను, పెళపెళ కాస్తున్న ఎండనీ లెక్క చెయ్యకుండా ‘మహిళా సదస్సు’కు చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల అక్కాచెల్లెమ్మలతో హుస్సేనాపురం నడుం బిగించిన ఉద్యమనారిలా గర్జించింది. ఏకదీక్షతో వింటిని సారించి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహ శరాలను సంధించింది. 

వేదిక స్థలం పరిధిని కూడా మించి వేలాది మంది తరలి రావడంతో చాలామంది అక్కాచెల్లెమ్మలు కుర్చీలు లేక నిలుచోవాల్సి వచ్చింది. వేదికపై నుంచి లేచి నిలబడి వారికి నా క్షమాపణలు చెప్పాను. ‘నిలుచున్నామా, కూర్చున్నామా అని కాదు.. ఈ సదస్సు సాక్షిగా చంద్రబాబును నిలదీయడానికి, ఆయన అబద్ధాల కట్టుబట్టల్ని తీయించి, నిలబెట్టడానికి వచ్చాం’ అనే దృఢసంకల్పం వారి మాటల్లో ధ్వనించింది. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం.. ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడానికి సదస్సుకు వస్తున్న మహిళల గొంతును నొక్కేయడం, పోలీసులను పెట్టించి మార్గమధ్యంలోనే వారిని అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా? అనే సందేహం కలుగుతోంది"

కం|| మహిళా సదస్సు జరుగగ
మహిళా మణులెల్ల బాబు మాటలు నిలదీ
సి హవనము జేయ కదిలిరి
సహనము క్షీణించి జగను సభకు సబలలై


20, నవంబర్ 2017, సోమవారం

జగన్ పన్నెండవ రోజు పాద యాత్ర - నా పద్యము

ఈ రోజు పాదయాత్ర డైరీలోని కొంత భాగం

"పాదయాత్రలో ఆదివారం వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వచ్చి కలిశారు. విద్యార్థులు, అవ్వాతాతలు, రైతులు, విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, అక్కాచెల్లెమ్మలు అందరూ వచ్చారు. వారంతా బాధల్లో ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అవ్వాతాతలకు పింఛన్‌లు ఇవ్వడం లేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌ అయ్యే సూచనలు లేవు. అక్కాచెల్లెమ్మల డ్వాక్రా రుణాలు రద్దు కాలేదు. వారికి సున్నా వడ్డీ రుణాలు పుట్టడం లేదు. బోయలను ఎస్టీలలో, రజకులను ఎస్సీలలో చేరుస్తామని, కాపు, బలిజలను బీసీలలో చేరుస్తామని, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా చంద్రబాబు ఎడాపెడా హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి, ఆశతో ఓటేసిన ప్రజలను అధికారంలోకి వచ్చాక మరిచిపోయే నాయకులకు శిక్షలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఎన్నికల వాగ్దానాలకు చట్టబద్ధత ఉండాలి. అలా ఉంటే.. ఎన్నికల హామీలు నెరవేరని పక్షంలో నిస్సహాయంగా ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉండదు.. వాళ్ల స్థితిని చూసి వెటకారం చేసే అవకాశం పాలకులకు రాదు."

ఆ.వె || బాస లెన్నొ చేసె బాబెన్నికలవేళ
ముఖ్య మంత్రి గాగ మొక్కు తీర్చ
డయ్యె, మోస పోయి డగ్గుత్తికన విల
పించు ప్రజల బాధ త్రెంచు నెవడు?

19, నవంబర్ 2017, ఆదివారం

జగన్ పదకొండవరోజు పాదయాత్ర - నా పద్యము

పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం - ఆ తరువాత నా పద్యం
 "మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంపై కూడా మహిళల్లో తీవ్రమైన బాధ వ్యక్తం అయింది. కిష్టపాడు నుంచి వచ్చిన కల్లె సుబ్బమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మద్యానికి బానిసైన భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆమెను చూసుకోడానికి కూడా ఎవరూ లేరు. ‘‘నాకు బతకాలని లేదన్నా..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె పరిస్థితిని చూశాక నాకు తీవ్ర ఆవేదన కలిగింది. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయమంటే ప్రజల రక్త, మాంసాలతో వ్యాపారం చెయ్యడమే. మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళల కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు సరికదా, అన్ని విధాలా సమాజాన్ని నష్టపరుస్తుంది. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదేమో కానీ, ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. ‘‘రేపటి మన ప్రజా ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది, నీ కష్టాన్ని తీరుస్తుందమ్మా..’’ అని సుబ్బమ్మకు భరోసా ఇచ్చాను. మద్య నిషేధం చారిత్రక అవసరం" 

ఆ|| మధ్య తరగతి ధన మానముల హరించి
రక్త మాంసములతొ రాష్ట్ర బొక్క
సమ్ము నింపి యేమి సాధింప ఁజూతురో
ఆంధ్ర పాలకులు స్మశాన స్థలిన

పదవరోజు జగన్ పాదయాత్ర. జిలేబికి కంద గడ్డలతో సవాల్ :)

జగన్ పదవరోజు పాదయాత్ర చేస్తుండగా కోవెలకుంట్లకు చెందిన ఓబులేసు వచ్చి తనకుమారునికి "మాట" సాయంచేయమని అర్థించాడు. దాని తాలూకూ సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ యిది.  దాని క్రింద ఆ వార్తకు నా పద్య రూపం. జిలేబీ కి  కందాల సవాల్ తో :)




ప్రాయము జూడారేండ్లు స
హాయము గోరొచ్చితిమి మహాత్మ పలుకులే
దాయె కుమారునికి ప్రజా
నాయక పలు చోట్ల తిరిగినామిఫలురమై

ఆరోగ్యశ్రీ  చెల్లదు
నోరార పిలిచిన పల్క నోపడె మాఱే
డారున్నొక్క లకారము
గోరెన్వైద్యులు చికిత్స కోసమె ఘనుడా


అదివినిన జగన్ విచలిత
వదనమున చికిత్స చేయు ప్రక్రియ సాగిం
ప దయన సోదరుని పిలిచి
కొదకొని యీ పని వదలకు కొండా యనియెన్