2, నవంబర్ 2008, ఆదివారం

ఆంధ్రావతరణ - తెలుగు భాష ప్రాచీన హోదా

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము ఈసారి ఒక కలికి తురాయి తురుముకొని స్వాగతించింది. నిజంగా తెలుగుభాష మీద ప్రేమున్న ప్రతి ఒక్కరికి ఇది మరువలేని అనుభూతి.ఈ విశాల విశ్వం లో తెలుగు సాహితీ ప్రియులు ఎక్కడైనా వుండవచ్చు. ఇది తెలుగు భాష కి ఈ శతాబ్దము లో జరిగిన గొప్ప సత్కారము.
రాజకీయ కారణాలు ప్రక్కన పెట్టి చూస్తే అసలు ఎ భాష ఎప్పుడు జానపదుల నోళ్ళలో నాట్యమాడిందో ఎవరు చెప్పగలరు? ఏ భాష అయినా గ్రాంధిక భాషగా మారాలంటే ముందు అది జనారణ్యం లో నుంచి పండిత భాష గా మారి రాజ కోటలో ప్రవేశిస్తే నే గాని ఆ భాష లో రచనలు సాధ్యము కాగలవు. తమ భాష మీద గౌరవముంటే నే సరిపోదు అది మిగతా భాషలు మా కంటే తక్కువ అని న్యాయస్థానాల ను ఆశ్రయించే తమిళ భాష ప్రియులను ఏరకంగా అర్ధము చేసుకోవాలో నాకైతే అర్థము కావటము లేదు. ఆంధ్ర ప్రదేశ్ తరువాత ఎక్కువగా తెలుగు మాట్లాడే రాష్ట్రం తమిళనాడే. నాకైతే గుమ్మడి కాయల దొంగ అంటే భుజము తడుము కొన్న సామెత గుర్తు వస్తుంది ( ఎక్కడ ఆ రాష్ట్రంలో తమిళ ఆధిక్యత తగ్గుతుందో అని.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form