3, డిసెంబర్ 2008, బుధవారం

పత్రికలు, రాజకీయాలు, ఉగ్రవాదం.

ఈ మధ్య కాలం లో అంటే 27 నవంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని నరరూప రాక్షసుల పైనా, P.O.K పైన సైనిక చర్య జరుపుతారా అని ఎదురు చుస్తూ కళ్ళు పత్తి కాయలు అయ్యాయి.అంతర్జాతీయ సంఘీభావం కూడగట్టుకోడానికి,సైన్యాన్ని సమాయత్త పరచడానికి కొంత సమయము పడుతుంది కాబట్టి ఇప్పటిదాక ఆగారేమో. అయినా యుద్ధానికి సన్నద్ధమయ్యె వాళ్ళు చెప్పి చెయ్యరు కదా? ఇదీ అంతే.నాకైతే మొఖాన ఉమ్మేసినా పట్టించుకోని రాజకీయ నాయకులు ఇప్పుడు Elections వస్తున్నాయి కబట్టి తప్పకుండ యుద్ధ భేరీ మోగిస్తారని పిస్తుంది.

ఇక పాకిస్తాన్ విషయనికి వస్తే తను పెంచి పోషించిన లష్కరే ఇప్పుడు పక్కలో బల్లెమై కూర్చింది.పాకిస్తాన్ లో 1947 నుంచి ఈ రోజుదాక ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే.ఈ పరిస్థితుల్లో లష్కర్ ముష్కరులు ప్రభుత్వము మాట వింటారా? అప్పటికి పాకిస్తాన్ ఆమెరికా మీద వత్తిడి ద్వారా భారత్ ను అణచాలని చూసింది."నేను సైన్యాన్ని ఆఫ్ఘన్ సరిహద్దులనుంచి P.O.K కి మారుస్తా అంది". ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ఇప్పటిదాక పాకిస్తాన్ సహయం తో ఆఫ్ఘనిస్తాన్ లో నెగ్గుకొస్తుంది.మరి పాకి సైన్యం లేకపొతే మళ్ళీ లాడెన్ చెలరేగిపోతాడు.దీన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ అమేరికాను ఇన్నిరోజులు blackmail చేస్తూ వస్తుంది.ఇది October లో జరిగిన USA presidential డిబేట్ లో కూడా దరిదాపు మెకైన్,ఒబామా ల అభిప్రాయం.అయితే పాకిస్తాన్ పాచిక ఈ సారి పారలేదు.రహస్య ఎజెండా ఏదైనా కాని ఈ మధ్య ఎందుకనో USA భారత దేశానికి దగ్గర అవుతున్నట్టనిపిస్తుంది.

పాకిస్తాన్ కి ఎవరూ సహాయ పడుతున్న సూచనలు లేవు. కానీ యుద్ధమంటూ వస్తే తప్పకుండా బయటికి చెప్పకుండా చైనా సహకరిస్తుంది.ఎవరు అవునన్నా కాదన్నా పైకి చూడ్డానికి అన్నిటిలో పోటీ ఇండియా - పాకిస్తాన్ లమధ్య లా వున్నా నిజానికి అది ఇండియా - చైనా ల మధ్యే అన్నది కఠోర వాస్తవం.

ఒక వేళ యుద్దమే వస్తే అమెరికా భారత్ కి ఒక చిన్న సహాయము చేస్తే చాలు.అది "ప్రస్తుతము అందరికీ చెప్పి కొంత చెప్పకుండా కొంత వివిధ రూపాల్లో పాకిస్తాన్ కి ఇస్తున్న సహాయం ఆపేస్తే చాలు". ఇండియా చేయాల్సిందల్లా భరత భూమిలో పుట్టి పాకిస్తాన్ ను సశ్య శ్యామలం చేస్తున్న జీవ నదులను భారత భూమి దాహాన్ని తీర్చడానికి మళ్ళిస్తే చాలు ఆర్ధికంగా అంతంత మాత్రానే వున్న పాకిస్తాన్ కుదేలైపొవటనికి. కాకపొతే దీంతో ఉగ్రవాదము నశించక పోగా ఇంకా పేట్రేగి పోవచ్చు.ఆకలితో వున్న మనిషి కడుపు నింపుకోవడానికి దేనికైనా సిద్ధ్హ పడతాడు. సోమాలియా సముద్ర దొంగలు ఇందుకు ఉదాహరణ.

ఇప్పుడు చిక్కల్లా పాకిస్తాన్ ISI ని కాని,సైన్యాన్ని కాని, ఉగ్రవాదులని కాని అదుపు చేయలేదు.అలా అని అది రాజకీయ కారణాలవల్ల ఒప్పుకోనూ లేదు.పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదులను వొదిలించుకోవాలంటే దానికి మిగిలిన ఒకే ఒక మార్గము , ఇండియా యుద్ధము తలపెడితే చూసీ చూడనట్టు వుండడమే.లేదంటే మన ఆర్ధిక వ్యవస్థ ఎలా వున్నా, పాకిస్తాన్ లో యుద్ధానంతర పరిణామలు అతి భయంకరంగా ఉండవచ్చు.అరాచకత్వం తో సామాన్య జన జీవనానికి కోలుకోలేని దెబ్బ.

ఇక మన విషయానికి వస్తే మన పత్రికలు చేసిన హంగమా చూసి నిజమా అని నన్ను నేను ఒకటికి పదిసార్లు రక్తము కారే దాక గిల్లుకోని చూసుకున్నాను. మనది నిజంగా విజయమా? అనామకులెవరో వచ్చి 190 మందిని పొట్టన పెట్టుకోవడము అడ్డుకోలేక పోయాము. N.S.G దళానికి సరైన విమానమే కరువైంది.ముఖ్య మంత్రి, హోం మంత్రు ల సంభాషణ(పేపర్లలో వచ్చినదాన్ని బట్టి) ముత్యాలు రాలి పొతాయన్నట్టు మహా క్లుప్తం.సందిట్లో సడేమియా లాగా ముఖ్య మంత్రి గారి ఇలాకు వాళ్ళకి తాజ్ లో రెడ్ కార్పెట్.

T.V వాళ్ళు , పత్రికల వాళ్ళు నాలాగా ఎవడికి తోచింది వాళ్ళు రాసారు.నాకొచ్చిన అనుమానాలు కూడా పత్రికా మేధావులకు రాక పొవడము నిజంగా నాకు ఆశ్చర్య మేసింది.

మనకు తెలిసి మొదటి రోజున ఏదో ముంబై పత్రికలో ఒక ఉగ్రవాది ఫొటో వేసారు.నేటికీ అందరూ అనుకొనేది ఒకడే దొరికాడని. క్రైం డిపార్టుమెంటు ఇలాంటివి ఎలాగూ బహిర్గత పరచరు కాబట్టి వాళ్ళు పట్టుకొన్నది ఎంతమందినైనా ఒక్కడనే చెప్తారు.అలాగే కథను కూడా అల్లుతారు.

ఎంతమందిని పట్టుకున్నా చెప్పింది ఒకడే దొరికాడు అని కాబట్టి మిగిలిన వాళ్ళని ఏరకమైన ఒత్తిడులు లేకుండా కాల్చి అవతల పడేయొచ్చు. లేదా అవసరమైన పక్షంలో విడిచి పెట్టవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు.

శవాలు 9, దొరికింది ఒక్కడు కాబట్టి లెక్క ప్రకారము వచ్చింది 10.కానీ లెక్క ఎంత గందరగోళంగా వున్నా మొదటి రెండు రోజులూ అందరి ఏకాభిప్రాయము 15.అంటే మిగిలిన వాళ్ళు దొరికారా? పారి పోయారా?

ఇప్పటిదాకా సామాన్యులు ఎంతమంది చనిపోయారో ఎవరి సంబంధీకులో ఏ పత్రికైనా రాసిందా?

సముద్ర యానం శ్రమతో కూడుకున్నది,రాగనే విధ్వంస్యం ఎలా మొదులెట్టారు?

అంత మందు గుండు సామాగ్రి తాజ్ లోకి ఎలా తీసుకెళ్ళ గలిగారు? ( ఈ ప్రశ్నకి ఇప్పటిదాకా నాకు సమాధానం దొరకలేదు)

వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినది ఏ దెశస్థుడు? ఇన్ని తెలుసుకున్న పోలీస్ ఇది తెలుసుకోలేదా?

-----------------???????????????????????????????????-----------------

1 కామెంట్‌:

  1. >>చూడ్డానికి అన్నిటిలో పోటీ ఇండియా - పాకిస్తాన్ లమధ్య లా వున్నా నిజానికి >>అది ఇండియా - చైనా ల మధ్యే అన్నది కఠోర వాస్తవం.

    మీరు చెప్పినట్టు అది యుద్దం దాకా వెళితే అది అమెరికా - చైనా యుద్దం అవుతుంది కానీ ఇండియా - చైనా యుద్దం కాదు అని నా ఉద్దేశ్యం.

    రిప్లయితొలగించండి

Comment Form