8, డిసెంబర్ 2008, సోమవారం

ముంబై మారణ హోమం - మూడు రాష్ట్రాల ప్రజా తీర్పు , ఓటరులో చైతన్యము వస్తుందా?

రేపు కాంగ్రెస్ సామంత రాజుల భవిష్యత్తు తేలబోతుంది.ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు రాజస్థాన్,మధ్యప్రదేష్,ఢిల్లీ,చత్తీస్ ఘడ్,మిజోరాం రాష్ట్రాల్లో పోటీ ముఖ్యంగా కాంగ్రెస్,భా.జ.పా. మధ్యనే ఉంది. ఎదో ఒకటి గెలవాలి కాబట్టి గెలుస్తుంది.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు , ఎలక్షన్ జరిగిన తేది లు యివి.

చత్తీస్ ఘడ్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 14 మరియు 2౦
మధ్యప్రదేష్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 25
ఢిల్లీ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 29
మిజోరాం : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 2
రాజస్థాన్ : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 4

ఇక్కడ నాకు చత్తీస్ ఘడ్,మధ్యప్రదేష్ లలో ఎవరు వస్తారో అని ఆసక్తి ఏమాత్రము లేదు.కాని మిగిలిన 3 రాష్ట్రాలు ఢిల్లీ,మిజోరాం,రాజస్థాన్ లలో నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది.కారణం ఈ 3 రాష్ట్రాల్లో ముంబై మారణహోమం తరువత ఓటింగ్ జరిగింది.

వీటన్నిటిలో కుడా ఢిల్లీ మీద ఆసక్తి ఎక్కువగా వుంది.కారణం ఇక్కడ నిరక్షరాస్యత తక్కువ.అలాగే ముంబై లో జరిగిన దారుణానికి కొద్దో గొప్పో అలోచించే వర్గము వారు ఎక్కువగా వుండే ప్రదేశాల్లో ఇది ఒకటి.ఉగ్రవాదనికి ప్రతిసారి బలి అయ్యే ప్రాంతాల్లో ఇది మొదటిది.అలాగే దేశ రాజకీయాలను మనందరికంటే దగ్గరిగా గమనించే మేధావి వర్గము వసించేదీ ఇక్కడే.

మిగిలిన 2 రాష్ట్రాలలో కూడా డిసెంబర్ లో ఎన్నికలు జరిగినా వాటిని విశ్లేషించ డానికి సరిపడా విషయ పరిఙ్ఞానము నా వద్ద లేదు. అంటే చదువుకున్న వారెంతమంది,పల్లెలెన్న్ని,ఉద్యోగులు మొదలైన చాలా విషయాలు ప్రభావము చూపుతాయి.

ఇక ఢిల్లీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే ఉగ్రవాదము,దేశభవిష్యత్తు మొదలైనవి టపాలు,ఆభిప్రాయలు,వ్యాసాలు,ఉపన్యాసాలు మొదలైన వాటికే పరిమితమా లేక ఓటరు లో నిజంగా ఈ మార్పు కనిపిస్తుందా లేదా అని.

నాకైతే ఇప్పటిదాక వేచిచూసే ధోరణి లో ఉన్న U.P.A నవంబర్ 29 తరువాత ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గల్లంతైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై యుద్ధభేరి మొగిస్తుందనిపిస్తుంది.ప్రతిదీ రాజకీయలతో ముడిపెట్టే మన రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చుడాలని వుంది.దానికి ఇంకా రెండు రోజుల టైం వుంది.

2 కామెంట్‌లు:

  1. "U.P.A నవంబర్ 29 తరువాత ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గల్లంతైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై యుద్ధభేరి మొగిస్తుందనిపిస్తుంది." hmm ఆసక్తికరమైన ప్రతిపాదన. ఇలా జరిగే అవకాశం మెండుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. Results are out.People decided country security is not something a party owns.It is a clear verdict that Congress has more faith in the voters than the BJP.

    రిప్లయితొలగించండి

Comment Form