1, డిసెంబర్ 2017, శుక్రవారం

జగన్ ఇరవై రెండవరోజు పాదయాత్ర డైరీ- నా పద్యము

ముందుగా ఈ రోజు డైరీ లోని కొంత భాగము ఆ తరువాత నాపద్యము

"కారుమంచి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు వచ్చి కలిశారు. ఆ స్కూల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేనందున బహిరంగ ప్రదేశాన్నే వాడాల్సిరావడం వారికి నరకయాతనగా మారింది. తాగే నీళ్లలో పురుగులు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో కూడా పురుగుల బాధ తప్పడం లేదు. స్కూల్‌ మొత్తం కంప చెట్లు పెరిగి, తరగతి గదుల్లోకి పాములు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న తరగతి గది గోడ ఇటీవల కూలిపోవడంతో ఒక విద్యార్థికి గాయం కూడా అయ్యిందట. స్కూల్‌కి వెళ్లాలంటేనే భయమేస్తోందని వాళ్లు నాతో చెప్పారు. స్కూల్‌ ఇంతటి దారుణ స్థితిలో ఉండటంతో స్కూలు హాజరు సగానికి సగం పడిపోయింది. తర్వాత గ్రామమైన కైరుప్పలలో కూడా విద్యార్థినులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. "



సీ|| చక్కని గంధముల్ చల్లు చిన్నారుల సత్ప్రవ ర్తననద్ది  చక్క నైన
భాషణముల నేర్పి భావిభారత పౌరులగ దీర్చిదిద్ది కలకలు బాపు
పల్లె బడులునేడు పట్టించు కొనునాథుడోపక  చిన్నారులోజము నశి
యించి యేడ్చుచునుంటి రీవేళ ఓంకార రాగముల్ వ్యాపించ రాజ్య మందు


ఆ.వె|| మరుగుదొడ్లు లేవు మరుగుయును గనము
ముట్ట మంచి నీళ్ళు పురుగు లొచ్చు
పాము లొచ్చి తిరుగు పాఠశాలల్లోన
కనరె మాదు బాధ కరుణ జూపి

1 కామెంట్‌:



  1. జగనన్నా ! మరుగుల్లే
    వు,గగన కుసుమంబయినది వున్నత చదువుల్
    సిగకొప్పుల వెలుగవలసి
    న కన్యలకటా జిలేబి నగుబాటయిరే !

    జిలేబి

    రిప్లయితొలగించండి

Comment Form