27, నవంబర్ 2017, సోమవారం

జగన్ పద్దెనిమిదవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ఈ రోజు జగన్ పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగము..ఆపై నా పద్యము

"ఈ రోజు గోరంట్లలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించాం. బలహీన వర్గాలు అన్న పదం వింటేనే నాకు బాధగా ఉంటుంది. అందరూ సమానంగా ఉండాల్సిన సమాజంలో ఈ అంతరాలెందుకు? బలహీన వర్గాలంటే తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాలే గానీ మేధస్సులో, శ్రమలో ఎవరికీ తీసిపోయేవాళ్లు కారు. అయితే తప్పుడు హామీలతో, తాత్కాలిక ప్రలోభాలతో నేతలు వీరిని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నందు వల్లే ఈ ప్రజలు ఇంతకాలం వెనుకబడిన వర్గాలుగానే ఉన్నారు."

గుణము నందరయగ కోరికష్టము చేయు
టందు సాటిగాదె యగ్రజులకు
తరతరముల తగని తమయధి కారమె
శాప మయ్యె మాకు జలజ నేత్ర

చిన్న వివరణ: ఇక్కడ మూడవపాదంలో "తరతరముల తగని తమయధి కారమె" అన్నప్పుడు "తమ" అంటే అగ్రకులజుల అని అర్థం. జగన్ కూడా అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా... కాబట్టి వాళ్ళ బాధనుఅలా వ్యక్తపరిచారు.

ఇది ఒక వెనుకబడిన తరగతి వాని ఆవేదన గా వ్రాయడమైనది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form